మహబూబ్నగర్, డిసెంబర్ 14 : జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీసీ ద్వారా కలెక్టర్ వెంకట్రావుతో మాట్లాడారు. ఓటరు జాబితా ప్ర త్యేక సవరణ కార్యక్రమం, డిజిటలైజేషన్, దరఖాస్తుల పరిష్కారం, జెండర్ నిష్పత్తి వివిధ అంశాలపై ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈనెల 26వ తేదీలోపు వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని తెలిపారు. దివ్యాంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఓటరు నమోదు సవరణలకు సంబంధించిన ఫారం 6, 7,8 ఆన్లైన్ డేటా ఎంట్రీ ఓటర్ జాబితా రూపకల్పన ప్రక్రియను పకడ్బందీగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండి న దివ్యాంగులందరికీ ఓటు హక్కు కల్పించి పో లింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. 100 సంవత్సరాలు నిండిన ఓటర్ల వివరాలు క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాలని ఆయన తెలిపారు.
ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎస్. వెం కట్రావు మాట్లాడుతూ ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను పకడ్బందీగా ముందుకు తీసుకుపోతున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ సీతారామారావు, ఇన్చార్జ్జి ఆర్డీవో ప్రేమ్రాజ్, మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, తాసిల్దార్లు పార్థసారథి, లక్ష్మీనారాయణ, జ్యోతి, ఎలక్షన్ విభాగం అధికారి జాఫర్, తదితరులు ఉన్నారు.