మక్తల్ టౌన్, డిసెంబర్ 14: ప్రభు త్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యాబోధన చేయాలని జీహెచ్ఎం అనిల్గౌడ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం మక్తల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్లస్టర్ పరిధిలోని రుద్రసముద్రం ప్రాథమికోన్నత పాఠశాల, మక్తల్ ఎంపీపీఎస్ జీపీలో జీహెచ్ఎం ఎఫ్ఎల్ఎన్ తరగతులను పరిశీలించి తరగతిగదిలో విద్యార్థుల సామర్థ్యాలను అంశాలవారీగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ప్రాథమికస్థాయిలో సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యం తో ప్రభుత్వం, ప్రాథమికస్థాయి విద్యపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి అంశాలవారీగా అన్ని విషయాల్లో సామర్థ్యాలు పెంపొందే విధంగా చదవడం, రాయడంతోపాటు ప్రాథమిక స్థాయి సామర్థ్యాలను పెంపొందించే విధంగా విద్యాబోధనను కొనసాగించాలని సూ చించారు. ప్రతి ఉపాధ్యాయుడు టీఎల్ఎంతోనే విద్యాబోధనను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.