మరికల్, డిసెంబర్ 14: మండల కేంద్రంలో ఉన్న రెండు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఆందుబాటులో లేకుండా చేయడంతోపాటు బ్లాక్లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం మండల కేంద్రానికి చెందిన యువకులు తాసిల్దార్ రాం కోటికి వినతిపత్రం ఆందజేశా రు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ అంతర్రాష్ట్ర రహదారిపై ఉన్న పెట్రోల్బంక్లో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచేవిధంగా ఆధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలే పెట్రోల్, డీజిల్ రెట్లు ఆకాశాన్నంటుతుండడంతో బ్లాక్లో పెట్రోల్, డీజిల్ విక్రయించడంతో వాహనదారులపై మరింత భారం పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ఆందుబాటులో ఉంచని బంక్ల నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవడంతోపాటు వారి లైసెన్స్ను రద్దు చేయాలన్నారు. బ్లాక్ దందాను ప్రోత్సహిస్తున్న పెట్రోల్ బంక్ యజమానులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువకు లు గోవర్ధన్, నర్సింహులు, రవి పాల్గొన్నారు.