అచ్చంపేట రూరల్, డిసెంబర్ 14 : నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ను రిటెర్డ్ రాష్ట్ర నీటిపారుదల, జలవిద్యుత్ శక్తి ఇంజినీర్ల బృందం సందర్శించింది. రిటెర్డ్ సీఈ శ్రీరాంరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 30 మంది రిటెర్డ్ ఇంజినీర్ల బృందం సభ్యులు టన్నెల్ పనిచేస్తున్న తీరును, పనుల పురోగతిపై నల్లగొండ నీటిపారుదల శాఖ ఎస్ఈ చక్రపాణిని అడిగి తెలుసుకున్నారు. 2004 ఏడాదిలో దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మన్నెవారిపల్లి వద్ద శ్రీశైలం వరకు టన్నెల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా నేటికీ పనులు పూర్తి కాలేదు. నల్లగొండ ఎస్ఈ చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని నుంచి రిటైర్డ్ ఇంజినీర్ల బృందం టన్నెల్ను పరిశీలించిందన్నారు. అనంతరం నాగార్జునసాగర్, బుద్ధవనం ప్రాంతాల్లో పర్యటించారన్నారు.