మూసాపేట, డిసెంబర్ 13: అధికారులు బాధ్యతాయుతం గా పనిచేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం మూసాపేట రైతువేదికలో మండల సర్వస భ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ఆల హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల, దాసరిపల్లి, కొమిరెడ్డిపల్లి, తుంకినీపూర్ సర్పంచులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ బిల్లులు కాలేదని, ఎస్టీవోలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే సెప్టెంబర్ వర కు అన్లైన్లో నమోదు చేసిన బిల్లులు వచ్చాయని, స్వ యంగా సీఎస్ వద్ద కూర్చొని పరిశీలించినట్లు తెలిపారు. గ్రా మాల వారీగా సర్పంచులు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అడిగారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఏఈతో మాట్లాడారు. రూ.58లక్షలకు సంబంధించిన బిల్లులు పెం డింగ్లో ఉన్నాయని, చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉ న్నందుకే ఎంబీలు సమర్పించలేదన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్పంచులు వెంట పడి పనులు చేయిస్తున్నప్పుడు ఎందుకు ఎంబీ చేయడం లేదన్నారు. ఒకటి రెండు టెక్నికల్ సమస్యల వల్ల జరిగే జాప్యానికి అవగాహన లేని సర్పంచులు ఎస్టీవోలో బిల్లులు పెండింగ్ ఉందని చెబితే అదే నమ్ముతూ ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదనే అపోహలు ఉంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
సమావేశం ప్రారంభం కాగానే ముందుగా గత సమావేశంలో గ్రామాల వారీగా ఏం అడిగారు. వాటిని ఎంతవరకు పరిష్కరించారనే విషయాలపై చెప్పిన తర్వాతనే అభివృద్ధి ఎజెండా చదవాలని ఎమ్మెల్యే సూచించారు. మూసాపేట అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలిపారు. జానంపేట ఎంపీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ స్థానిక అవసరాలకు ఇసుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పడంతో స్పందించిన ఎమ్మెల్యే ఆల దందా చేసే వారికి లేని నిబంధనలు ప్రభుత్వ పనులు చేసేందుకు, ప్రజలకు అడ్డువస్తాయా అని తాసిల్దార్ మంజులను ప్రశ్నించారు. వాస్తవాలను చూసి అనుమతి ఇవ్వాలన్నారు. మూసాపేటకు నూతనంగా 132/33 కేవీ సబ్స్టేషన్ మం జూరైనదని, వెంటనే స్థలం చదును చేసి అప్పగించాలని ఎంపీపీ, తాసిల్దార్కు సూచించారు. మహ్మద్హుస్సేన్పల్లి సర్పంచ్ నిర్మల, నిజాలాపూర్ ఎంపీటీసీ సీజీ గోవర్ధన్ మా ట్లాడుతూ రోడ్డు సరిగాలేదని, బీటీరోడ్డు మంజూరు చేయాలన్నారు. నందిపేట, జానంపేటలో తాగునీటి సమస్య ఉం దని ఆయా గ్రామాల సర్పంచులు అడిగారు. కార్యక్రమం లో జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతికొండయ్య, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో స్వరూప, ఏఈ వెంకటయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.