మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 8 : దశలవారీగా మహబూబ్నగర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి శ్రీ నివాస్గౌడ్ చెప్పారు. మున్సిపాలిటీలో ని 16వ వార్డు పరిధిలో ఉన్న హనుమా న్ చెరువు తండా మీదుగా వస్తుండగా స్థానికులను చూసి కాన్వాయ్ నిలిపి వా రితో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి రా ష్ట్ర పాలనలో రూ.200 ఉన్న పింఛన్ తె లంగాణ వచ్చాక రూ.2,016 వస్తుందన్నారు. మహబూబ్నగర్ను రాష్ట్రంలోనే నెంబర్వన్గా నిలుపుతామన్నారు. తం డాలో అసంపూర్తిగా ఉన్న ఆలయం, అంగన్వాడీ స్కూల్ భవన నిర్మాణానికి సాయం అందించాలని మంత్రిని తం డావాసులు కోరారు. స్పందించిన ఆయ న వెంటనే నిధులు విడుదల చేసి పను లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పనులు పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి మళ్లీ వస్తానని చెప్పారు. ని ధులు మంజూరు చేసిన మంత్రికి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంట కౌన్సిలర్ మోతీలాల్, మాజీ కౌ న్సిలర్ శరత్చంద్ర ఉన్నారు.
జనవరి 18 నుంచి కంటివెలుగు
మహబూబ్నగర్అర్బన్, డిసెంబర్ 8 : జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు. గురువారం జిల్లా కేంద్రంలో ని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కం టి వెలుగు కార్యక్రమానికి ఎంపికైన 45 మంది ఆప్తాలమిక్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి చూపు మందగించిన వారికి కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా అందిస్తామన్నారు. జిల్లాలో 45 బృందాలు పా ల్గొంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శశికాంత్, జి ల్లా మలేరియా అధికారి డాక్టర్ తిరుపతిరావు, నాయకులు పాల్గొన్నారు.
ఆలయాలకు పూర్వవైభవం..
పాలమూరు, డిసెంబర్ 8 : తెలంగా ణ ఏర్పడ్డాకే ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో నూతనంగా ని ర్మించిన గోపురం, శిఖరం, ముఖద్వా రం, కలశ గణపతి, నవగ్రహ, ధర్మశాల పునఃప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హా జరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అన్ని మతాల కు ప్రాధాన్యమిస్తూ నిజమైన లౌకిక పా లన కొనసాగిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. కొందరు కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షే మ పాలన కొనసాగిస్తున్నదని చెప్పారు. పాలనకు నిజమైన రూపం కేసీఆర్ అని అన్నారు. సకల సౌకర్యాలతో ఊహించ ని విధంగా యాదాద్రి ఆలయాన్ని పునఃనిర్మాణం చేసిన ఘనత ఆయనదే అ న్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎ న్నో యాగాలు, హోమాలు చేస్తున్నారని తెలిపారు. సమైక్య పాలనలో మన్యంకొండ ఆలయం నిరాధరణకు గురైందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహకారంతో అద్భుతంగా తీర్చిదిద్దామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణమోహన్, రాజేశ్వర్, నా యకులు, భక్తులు పాల్గొన్నారు.