మక్తల్ టౌన్, డిసెంబర్ 8 : పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం రథోత్సవం కనులపండువగా అంగరంగ వైభవంగా సాగింది. అంతకుముం దు స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భ క్తులు బారులుదీరి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, పం చామృతాభిషేకం, మహామంగళహారతి, ప్రత్యేక అలంకర ణ, పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వివి ధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. పట్టణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతిని ధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
అంజన్నకు పూజలు
ఊట్కూర్, డిసెంబర్ 8 : మండలంలోని బిజ్వారం పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భా గంగా గురువారం ఆల య పూజారి నర్సింహచా రి జోషి ఆధ్వర్యంలో అం జన్నకు పంచామృతాభిషే కం, మహామంగళహారతి, పట్టు వస్ర్తాలతో ప్రత్యేక అ లంకరణ, పల్లకీ సేవ, భ క్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యు లు మహేశ్గౌడ్, వెంకట ప్ప, రాంచంద్రయ్యగౌడ్, సుధాకర్రెడ్డి, హన్మిరెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.
వైభవంగా రథోత్సవం
కృష్ణ, డిసెంబర్ 8 : మండలంలోని తంగిడిగిలో వెలిసి న ఆంజనేయస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో అంజన్నకు పంచామృతాభిషేకం, మహామంగళహారతి, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవ మహోత్సవానికి వివి ధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం ఎదుట మహిళలు, యు వకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మహిబూబ్ పాషా, ఆలయ కమిటీ సభ్యు లు, గ్రామస్తులు, వివిధ రాష్ర్టాల భక్తులు పాల్గొన్నారు.
మాధవరంలో…
మరికల్, డిసెంబర్ 8 : మండలంలోని మాధవరం రో డ్డు సమీపంలో వెలిసిన ఆంజనేయస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి స్వామివారి రథోత్స వం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్ నినదాలతో ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణం మార్మోగింది. అంతకుముందు నారాయణపేట పడమటి ఆంజనేయస్వామికి జెడ్పీ వైస్చైర్పర్సన్ సురేఖారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మాధవరం రోడ్డు ఆంజనేయస్వామి ఆలయంలో కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమం పూజారి నారాయ ణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
గున్ముక్లలో…
ధన్వాడ మండలంలోని గున్ముక్లలో వెలిసిన కడపరాయస్వామి ప్రభోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రథోత్సవానికి కర్ణాటక, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తారన్నారు.