నారాయణపేట టౌన్, డిసెంబర్ 8 : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ చాటి ఉమ్మడి జిల్లాకు పేరు తీసుకురావాలని మున్సిపల్ వైస్చైర్మన్ హరినారాయణ భ ట్టడ్ సూచించారు. ఈనెల 9, 10, 11తేదీల్లో సికింద్రాబాద్లోని కంట్రోన్మెంట్ ఇండోర్ స్టేడియంలో 41వ రాష్ట్రస్థా యి జూనియర్ ఖోఖో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. పో టీల్లో ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొనే క్రీడాకారులకు వారం రోజులపాటు పట్టణంలోని మినీ స్టేడియంలో క్యాంప్ నిర్వహించారు. క్యాంప్ ముగింపు సందర్భంగా గురువారం ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులను ఉద్దేశించి ఆ యన మాట్లాడారు.
వారం రోజులపాటు క్రీడాకారులు నే ర్చుకున్న మెళకువలను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యుడు ఆత్మారాం ఎడ్కే అందించిన దుస్తులను క్రీడాకారులకు పంపిణీ చేశా రు. అనంతరం క్రీడాకారులు హైదరాబాద్కు బయల్దేరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి రవికుమార్గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు కతల ప్ప, కార్యదర్శి బాలరాజు, ఉపాధ్యక్షుడు అనంతసేన, శిక్షకులు వెంకటప్ప, వెంకటేశ్, చక్రవర్తి, సుగుణాకర్, వెంకట్, హాస్టల్ వార్డెన్లు కల్యాణి, కృష్ణమూర్తి, బాలాజీ, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల్, వరపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడలకు విద్యార్థి ఎంపిక
మక్తల్ టౌన్, డిసెంబర్ 8 : జిల్లాస్థాయి ఖోఖో క్రీడలకు మండలంలోని కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీలత రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడలకు ఎంపికయ్యిందని పీఈటీ రూప గురువారం తెలిపారు. నవంబర్ 25న నిర్వహించిన జిల్లాకేంద్రంలోని స్టేడియం గ్రౌండ్లో జిల్లాస్థాయి సబ్ జూనియర్ ఖోఖో ఎంపిక పోటీల్లో శ్రీలత ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటుందన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన శ్రీలతను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
జాతీయ క్రీడలకు విద్యార్థుల ఎంపిక
మరికల్, డిసెంబర్ 8 : ధన్వాడ మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయస్థా యి నెట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజారాం గురువారం తెలిపారు. ఈ నెల 10, 11న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో నిర్వహించనున్న 15వ ఉ త్తర భారతదేశ స్థాయి పురుషులు, మహిళలు నెట్ బాల్ పోటీలకు విద్యార్థులు శ్రీకాంత్, బధ్రు, శ్రీను ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల ఎంపికపై వైస్ ప్రిన్సిపాల్ సురేశ్రావు, కోచ్ రామ్మోహన్, పీఈటీ సుగుణాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.