కొల్లాపూర్, డిసెంబర్ 8 : ముగ్గురు ఆడపిల్లల త రువాత కలిగిన నాలుగో సంతానంలో మగపిల్లాడు జన్మించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి అ వధుల్లేవు. కానీ, వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన మూడో రోజు నుంచే దవాఖానల చు ట్టూ కాలం గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఐదేండ్లు గా రూ.లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆస్తులన్నీ అమ్మి బాబుకు చికిత్స చేయిస్తున్నారు. అయినా మాయదా రి రోగం తగ్గడం లేదు. కూర్చోలేక, నడవలేక ఆ బా బు నరకం చూస్తున్నాడు.
పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామానికి చెంది న నల్లబోతుల రాజు, అనూష దంపతులకు నలుగురు సంతానం.
ఇందులో ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శివానందం పు ట్టిన మూడో రోజే ఫిట్స్ వచ్చింది. 45 రో జులు హైదరాబాద్లోని ని లోఫర్ దవాఖానలో చికిత్స చేయించారు. వయస్సు పెరుగుతున్నా ఎలాంటి మార్పు రాలేదు. చూడడానికి ఆరోగ్యంగా నే ఉన్నాడు. కానీ, ఐదేండ్లుగా కనీసం కూర్చోలేని, నడవలేని స్థితిలో ఉన్నా డు. సొంతంగా అన్నం, నీళ్లు కూడా తాగలేని పరిస్థితి. శి వానందంకు మెరుగైన చికిత్స అందించాలని మహబూబ్నగర్, హైదరాబాద్ దవాఖానల్లో రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. అయినా ఎలాంటి ఫలితం లేదు.
శివానందం వెన్నెముక బలహీనంగా ఉండడంతో కూర్చోలేకపోతున్నారని వైద్యులు చెప్పారు. ఉ న్న ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించామని, ఇ క చికిత్స కోసం డబ్బుల్లేక, బాబు పరిస్థితిని చూసి చచ్చిబతుకున్నామని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మానవతావాదులు, దాతలు స్పందించి తమ కొడుకుకు ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకున్నవారు 8008224192 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు.