వీపనగండ్ల, నవంబర్ 27 : కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.110 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీంతో టీఆర్ఎస్ మండల ఆధ్వర్యంలో ఆదివారం మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణ య్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గానికి రూ.110 కోట్లు, వీపనగం డ్ల మండలానికి మొత్తం రూ.24.69 కోట్లు నిధులు మం జూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయనిర్మాణపనులకు రూ.2 కోట్లు నిధులు మంజూ రు చేయడం అభినందనీయం అన్నారు. పుల్గర్చర్ల గ్రామం నుంచి శ్రీరంగాపూర్ గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం రూ.5 కోట్లు, సంగినేనిపల్లి నుంచి లక్ష్మీనరసింహాస్వా మి గుట్టమీదుగా వల్లభాపురం వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.4 కోట్లు, సంగినేనిపల్లి నుంచి వీపనగండ్ల క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.60 లక్షలు మంజూరు చే శారన్నారు. అంతేకాకుండా మండలకేంద్రం నుంచి మారుమూల గ్రామాలను అనుసంధానం చేసేందుకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయనకు మండలప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్న ట్లు వారు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచులు విజ య్, రామేశ్వర్రావు ఎంపీటీసీ భాస్కర్రెడ్డి టీఆర్ఎస్ నాయకులు సురేందర్రెడ్డి, కోటిరెడ్డి, తిరుపతయ్య, రజాక్, వెంకటయ్య, శేఖర్, సాయిబాబా, కురుమయ్య పాల్గొన్నారు.
చిన్నంబావికి రూ.5కోట్లు మంజూరు
చిన్నంబావి, నవంబర్ 27 : చిన్నంబావి మండల అభివృద్ధి రూ.5కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్, నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదన్న ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ చిన్నంబావి మండల పరిషత్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.2కోట్ల నిధులు, చిన్నంబావి మీదుగా గూ డెం వెళ్లే దారిలో కాశిరెడ్డి వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.3కోట్ల నిధులు మంజురు చేశారని వివరించారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే బీరం ఆధ్వర్యంలో జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ ఉమ్మడి మండల వ్యవహారాల బాధ్యుడు శ్రీధర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మద్దిలేటితోపాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.