నాగర్కర్నూల్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) :పేదల సొంతింటి కల సాకారం కాబోతున్నది. జనవరి 15 వరకు పెండింగ్లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న కలల సౌధం పేదల దరికీ చేర్చేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 2,871 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా 881 ఇండ్లకు దాదాపు రూ.165కోట్లతో టెండర్ ఖరారైంది. వీటిలో 668 ఇండ్ల పనులు ఇప్పటికే పూర్తి కాగా.. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. అచ్చంపేట, కల్వకుర్తి శివారులోని ఇండ్ల పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రోడ్లు, నీరు, కరెంట్ సౌకర్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయించాలన్న ప్రణాళికతో అధికారులు అడుగులు వేస్తున్నారు. జనవరి 15లోగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించేలా కలెక్టర్ ఉదయ్కుమార్ కసరత్తు ప్రారంభించారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గానికి 2 వేల ఇండ్లు మంజూరయ్యాయి. వెయ్యి పూర్తవగా.. 400 ప్రారంభ దశలో.. మిగితావి నిర్మాణంలో ఉన్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు సర్వే చేశారు.
పేదల సొం తింటి కల త్వరలో సాకారం కానున్న ది. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇం డ్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మంజూరు చేసిన ఇండ్లు చాలా వరకు చి వరి దశలో ఉన్నాయి. వీటిని వచ్చే ఏడాది జనవరి 15లోగా త్వరలో పూర్తి చేయాలని కలెక్టర్లకు సీ ఎస్ సోమేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రామాలు, పురపాలికల్లో తుది దశలో ఉన్న, పూర్తయిన ఇం డ్ల పనులకు తుది రూపు ఇవ్వనున్నారు. ఇప్పటికే పూర్తయి న ఇండ్లకు మౌలిక సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి పనులు పూర్తి చేయనున్నారు. పూర్తయిన ఇండ్ల ను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తెల్లకార్డు ఉండి కిరాయి ఇండ్లల్లో నివసిస్తున్న పేదలను ముందుగా గుర్తిస్తారు. పల్లెల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించి.. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటన్నింటినీ సంబంధిత తాసిల్దార్లకు పంపి స్తే.. వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు అందజేస్తారు. ఈ వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిస్తారు. ఇలా గ్రామ స్థాయి నుంచి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపికను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం నిర్మించిన ఇండ్లకంటే ఆశావహులు అధికంగా ఉంటే లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. మిగిలిన వారిని వె యిటింగ్ జాబితాలో ఉంచుతారు. నాగర్కర్నూల్ జిల్లాకు 2,871 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా.. 881 ఇండ్ల టెండర్కు దాదాపు రూ.165 కోట్లతో ఖరారైంది. ఇందులో 668 ఇండ్ల పను లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన ఇండ్లు వివిధ దశల్లో ఉన్నా యి. ఈ నిర్మాణాలను డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయించేలా క లెక్టర్ ఉదయ్కుమార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్ర భుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తయిన ఇండ్లను పంపిణీకి సి ద్ధంగా ఉంచాలని సూచించారు. అచ్చంపేట, కల్వకుర్తి శివారులో నిర్మించిన ఇండ్ల పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. రోడ్లు, నీ రు, కరెంట్ వంటి సౌకర్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నాగర్కర్నూల్లో రూ.10.17కోట్లతో చేపట్టిన పనులు ప్లాస్టరింగ్ దశలో ఉన్నాయి. మొత్తమ్మీద ఈ పనులను జనవరి 15లోగా పూర్తి చేసి పంపిణీ చేయాలని నిర్ణయించడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
జనవరి 15లోగా పనులు పూర్తి..
ప్రభుత్వ ఆదేశాలతో డబుల్ బెడ్రూం ఇండ్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. జనవరి 15వ తేదీలోగా పెండింగ్ పనులు పూర్తి చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలిచ్చాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేల సమన్వయంతో లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తాం. – ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్