గద్వాల టౌన్, నవంబర్ 25 : నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు’.. అన్న రోజుల నుంచి.. వైద్య సేవల కోసం ప్రభుత్వ వైద్యశాలల వద్ద రోగులు క్యూ కట్టే రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ వైద్య రంగానికి పెద్దపీట వేశారు. ఈ క్రమంలో మౌలిక వసతులు, సదుపాయాలు, పరికరాల కల్పనతోపాటు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉంటున్నారు. దీంతో కార్పొరేట్ స్థాయిలో వైద్యం సూపర్గా అందుతున్నది. గద్వాల జిల్లా దవాఖానలోనూ వైద్య సేవలు మెరుగయ్యాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆధునిక పరికరాలను సమకూర్చారు. రూ.60 లక్షల విలువైన రెండు టీఫాస్కానింగ్ మిషన్లు అందుబాటులోకి రాగా శనివారం వర్చువల్ విధానంలో వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్రావు ప్రారంభించ నున్నారు. ఇక గర్భిణులకు మరింత మెరుగ్గా వైద్యం అందనుండగా..గర్భస్థ దశలోనే లోపాలు గుర్తించి ముందుగానే చికిత్సలు అందించేందుకు అవకాశం ఏర్పడనున్నది.
సమైక్య పాలనలో ‘నేను రానో బిడ్డో.. సర్కార్ దవాఖానకు’ అనే నానుడిని.. స్వరాష్ట్రంలో ‘నేను పోతా బి డ్డో.. సర్కార్ దవాఖానకు’ అనేలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. ఏడాదికేడాది సర్కార్ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. కార్పొరేట్ను తలదన్నేలా ఆధునిక పరికరాలు సమకూరుస్తున్నది. కేసీఆర్ కిట్, డయాగ్నొస్టిక్ సెంటర్లు సత్ఫలితాలనిస్తున్నాయి. ఈ క్ర మంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ మరో ముందడుగు వేసింది. శిశువుల్లో లోపాలను గుర్తించేందుకు జోగుళాంబ గ ద్వాల జిల్లా దవాఖానల్లో రెండు టీఫా స్కా నింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. నేడు వై ద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
తల్లీబిడ్డల క్షేమం కోసం..
ఏటా వేలాది మంది చిన్నారు లు ఏదో ఒక లోపంతో జన్మిస్తున్నారు. ఈ సమస్యను అ ధిగమించి తల్లీబిడ్డల ఆ రోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభు త్వం సరికొత్త ఆ లోచనకు శ్రీ కారం చు ట్టింది. అ వసరమై న వారికి టీఫా స్కానింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ టెస్టు ద్వారా బి డ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించే వీలుంటుంది. తద్వారా మెరుగైన వైద్యం అందించొచ్చు. గర్భం దాల్చిన 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని టీఫా స్కానింగ్ చేస్తారు. శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు ఈ స్కానింగ్ ఎంతగానో దోహదపడుతుంది. టీఫా స్కానింగ్తో గర్భంలో శిశువు కాళ్లు, చేతులు, ముఖం, చెవులు, నోటితోపాటు గుండె, ఊపిరితిత్తుల పనితీరు వంటి విషయాలు తెలుసుకోవచ్చు. ప్రధానంగా మేనరికపు వివాహాలు, జన్యు లోపాలు, మానసిక సమస్యలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకొని స్కానింగ్ చేస్తారు. ఇలా గుర్తించిన సమస్యలకు మందులు వాడి సరిచేసుకునే వీలుంటుంది. మందులకు నయం కాని పక్షంలో వైద్యుల సలహా, తల్లిదండ్రుల నిర్ణయం మేరకే ఇతర చర్యలు తీసుకుంటారు. ఈ స్కానింగ్ కోసం ప్రైవేట్ సెంటర్లకు వెళ్తే రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది. ఇంత మొత్తంలో మధ్య తరగతి, పేదలు చెల్లించలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సర్కార్ ఉచితంగా స్కానింగ్ సౌకర్యం కల్పించింది.
రూ.60 లక్షలు వెచ్చించి..
కాన్పుల నిర్వహణలో రాష్ట్రంలోనే జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖా న మొదటి స్థానంలో ఉన్నది. ప్రతి నెలా నార్మల్, సీజేరియన్ కాన్పులు క లిపి 400 వరకు చేస్తున్నారు. ఏడాదికి దాదాపుగా ఐదు వేల వరకు డెలివరీలు ఉంటున్నాయి. ఈ క్రమంలో టీఫా స్కానింగ్కు గర్భిణులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి.. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీం తో టీఫా స్కానింగ్ ఎంతో అవసరమన్న విషయాన్ని గుర్తించిన టీఎస్ఎంఎస్ఐడీసీ నిధుల ద్వారా మంత్రి హరీశ్రావు జిల్లాకు రెండు టీఫా స్కానింగ్ మిషన్లు కేటాయించారు. ఒక్కో స్కానింగ్ మిషన్ను రూ.30 లక్షల చొప్పున రెండు మిషన్లకు రూ.60లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
పేదలకు ఎంతో మేలు..
స్కానింగ్ మిషన్లు జిల్లా దవాఖానలో అందుబాటులోకి రానుండడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఎంతో మేలు జరగనున్నది. ఈ స్కానిం గ్ ద్వారా శిశువు గర్భంలో ఉన్నప్పుడే అవయవలోపాలను, ఎదుగుదలను గుర్తించే వీలుంటుంది. టీఫా స్కానింగ్ మిషన్లను శనివారం మంత్రి హరీశ్రావు వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించనున్నారు.
– నవీన్క్రాంతి, జిల్లా దవాఖాన ఇన్చార్జి సూపరిం టెండెంట్, గద్వాల