మక్తల్ టౌన్, నవంబర్ 25 : పేదల ఆరోగ్య రక్షణకు కొండంత అండగా సీఎంఆర్ఎఫ్ నిలుస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ని ఎమ్మెల్యే నివాసంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. జక్లేర్ గ్రామానికి చెందిన సావిత్రమ్మకు రూ.8,500, ఊట్కూర్ మండలం కొల్లూ రుకు చెందిన బస్వరాజ్కు రూ.50 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ సాయం పేదలకు ఆర్థిక భరోసా కల్పించిందన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న ఎందరో ఈ పథకంతో మేలు చేకూరిందన్నారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, నాయకుడు రామలింగం పాల్గొన్నారు.