నారాయణపేట టౌన్, నవంబర్ 25 : 18 ఏండ్లు పూర్తై న యువత ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రతి పోలింగ్ బూత్లో ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతారని తెలిపారు. ఓటరు నమోదు కో సం తమ సమీపంలోని పోలింగ్ స్టేషన్కు తగిన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, ఫొటో, ఫారం 6ను పూర్తి చేసి తీసుకెళ్లాలన్నారు. ప్రత్యేక క్యాంపెయిన్ రోజుల్లో ఉదయం 10 నుం చి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్వోలు అందుబాటు లో ఉంటారని, ఆన్లైన్లో కూడా ఓటరు నమోదు చేసుకోచ్చన్నారు. జాబితాలో మార్పులు, చేర్పులు, చనిపోయిన ఓటర్ల తొలగింపు, పోలింగ్ స్టేషన్ మార్పు తదితర వాటిని క్యాంపెయిన్లో నమోదు చేసుకోచ్చన్నారు. 18 ఏండ్లు నిం డిన వారు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ శ్రీహర్హ అన్నారు. మండలంలోని మల్రెడ్డి, నర్సాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కొ న్ని సూచనలు చేశారు. గన్నీ బస్తాలు, తూకం కాంటాలు, తేమ శాతం చూసే మిషన్లు అందుబాటులో ఉంచుకోవాలని, రైతులకు టోకెన్లు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మ యాంక్ మిట్టల్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ‘తొలిమెట్టు’
పాఠశాలల బలోపేతానికి మన ఊరు మ న బడి నుంచి చేపడుతున్న పనులకు తోడు విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా తొలిమెట్టు కార్యక్రమం తోడ్పడుతుందని కలెక్టర్ శ్రీహర్హ అన్నారు. మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల, కేజీబీవీని శుక్రవారం కలెక్టర్ అదనపు కలెక్టర్ మిట్టల్తో కలిసి పరిశీలించారు. కేజీబీవీ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు, బోర్డుపై భారతదేశ చిత్రపటం వేసి రాజధానిని గుర్తింపజేశారు. విద్యార్థులందరూ 10కి10 సాధించే విధంగా చదువుకోవాలన్నారు. అనంతరం విఠలాపూర్ పాఠశాలలో వి ద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వంట ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా వారానికి మూడు సార్లు గుడ్లు అందించాలని ఆదేశించారు. గడిమున్కన్పల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న పనులపై ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పది రోజుల్లో పను లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎంఈవో వెంకటయ్య, ఎంపీపీ నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
మక్తల్ టౌన్, నవంబర్ 25 : తెలంగాణ విద్యాశాఖ ఆ ధ్వర్యంలో సమగ్ర శిక్షణకళా ఉత్సవం జిల్లాస్థాయిలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో యాపిల్ చాలెంజర్స్ స్కూల్ విద్యార్థి జ్ఞాపిక పాల్గొని ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థా యి పోటీలకు ఎంపికైందని పాఠశాల కారస్పాండెంట్ రత్నకుమారి తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈనెల 23న నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని నృత్య ప్రదర్శన చేసిందన్నా రు. రాష్ట్రస్థాయి నృత్య ప్రదర్శనకు ఎంపిక కావడంతో శుక్రవారం కలెక్టర్ నుంచి జ్ఞాపిక ప్రశంసాపత్రాన్ని అందుకోవడం జరిగిందని రత్నకుమారి తెలిపారు.