మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 2 : హైదరాబాద్లోని ఉప్పల్ స్థాయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని పాలమూరులో నిర్మించాలని హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఆదివారం హైదరాబాద్లో క్రికెట్ అభివృద్ధిపై అజారుద్దీన్తో మంత్రి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్నగర్లో గతంలో పలువురు ఆటగాళ్లు జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో రాణించారని తెలిపారు. భవిష్యత్తులో ఆటగాళ్లును సిద్ధం చేసేందుకు స్థానికంగా అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మైదానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే అవకాశం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్థానిక అధికారులతో చర్చించి హెచ్సీఏను సంప్రదిస్తామని మంత్రి తెలిపారు. స్పందించిన అజారుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున భూమిని కేటాయిస్తే మహబూబ్నగర్లో అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు.