కొల్లాపూర్, ఆగస్టు 18 : కేంద్రంలోని మోదీ సర్కార్ ఎనిమిదేండ్ల కాలంలో దేశంలో ఒక్క గుడి కట్టలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కనీసం ఐదారు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులను సైతం కట్టలేదని ధ్వజమెత్తారు. కానీ ఆలయాల పేరుతో దేశంలో అడ్డుగోడలు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం కొల్లాపూర్ మం డలం సింగవట్నంలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు.
అంతకుముందు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రధాన అర్చకులు ఓరుగంటి సంపత్కుమార్ శర్మ పూర్ణకుంభం తో స్వాగతం పలికి సత్కరించారు. ఆలయంలో పూజ లు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది ప్రాణత్యాగం చేయడం వల్లే స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. మహనీయులు ఒక్కొక్కరూ ఒక్కో తరహాలో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 ఏండ్లుగా తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నామని తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో గుడిలో దేవుళ్లకు దీపం పెట్టే పరిస్థితి లేకుండే అన్నారు. నేడు ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం గ్రామగ్రామాన అర్చకులను నియమించి ప్రతి నె లా వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించిన ఘనత కేసీఆర్దే అన్నారు. సింగవట్నం ఆలయం పునర్నిర్మాణం ఆగమ శాస్త్ర ని యమ నిబంధనల మేరకే జరుగుతుందన్నారు. ఈ ని ర్మాణం పూర్తయితే మరో 500 ఏండ్ల వరకు భక్తులకు ఇబ్బంది ఉండదన్నారు. అతి తక్కువ సమయంలో పూ ర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.
ఆలయం తిరిగి నిర్మించాలనే ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ముందు ఎమ్మెల్యే బీరం పెట్టగా.. దానికి తాను సహకరించానన్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. అందుకు అవసరమైన ప్రణాళిలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆధునిక సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే సింగోటం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ ఉద య్ మాట్లాడుతూ సింగవట్నం ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రికి, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. సింగవట్నాన్ని మండలం చేయాలనే ప్రతిపాదనను సీఎంకు నివేదిస్తామన్నారు.
అనంతరం సింగవట్నం చెరువులో మత్స్యకారులు పట్టిన 12 కిలోల చేపను మంత్రికి అందజేశా రు. మంత్రి, ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. మాచినేనిపల్లికి చింతలపల్లి సబ్ స్టేషన్ నుంచి ప్రత్యేక విద్యుత్ ఫీడర్ పనులకు సర్పంచ్ సుజాతతో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, ఎంపీపీలు భోజ్యానాయ క్, కమలేశ్వర్రావు, విండో చైర్మన్ చింతకుంట శ్రీనివాసులు, సర్పంచ్ మండ్ల కృష్ణయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు నిరంజన్, డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి, జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.