గోపాల్పేట, ఆగస్టు 18 : విద్యావ్యవస్థను బలోపే తం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తాడిపర్తిలో ‘మన ఊరు-మన బడి’ కింద రూ.57.90 లక్షలతో నిర్మించనున్న పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలను ప్రారంభించి, పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఏదుట్ల రోడ్డు ప క్కన్న రూ.75 లక్షల నిర్మించనున్న కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, కస్తూర్బా పాఠశాల ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మించనున్న జూనియర్ కళాశాల తరగతి గదులు, వసతి గృహాలను మంత్రి ప్రా రంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భావి త రాలకు మెరుగైన విద్య అందాలన్నదే సీఎం కేసీఆర్ ఆ కాంక్ష అని అన్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద ప్ర భుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపా రు. సామాన్యులు ప్రైవేటు విద్య మోజులో పడి కష్టార్జి తం కోల్పోవద్దన్నారు. సర్కార్ బడులకే పంపించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. గురుకులం మా దిరిగానే ప్రతి ఊరి పాఠశాలలో విద్యాబోధన అందిస్తామని చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రా మానికి సాగు నీరు తీసుకొచ్చానని చెప్పారు. పార్టీ మీ టింగులకు పిలిస్తే మాకు వ్యవసాయ పనులున్నాయని చెప్పే రోజులు రావాలన్నారు. ప్రస్తుతం ఆ రోజులు రా వడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వనపర్తిలో మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 510 కోట్లు మంజూరు చేసిందన్నారు.
త్వరలో కొత్త పింఛన్ల పంపిణీని స్వయంగా ప్రారంభిస్తామన్నారు. అనంతరం బుద్ధారం గండిలో 45 అడుగుల ఎత్తయిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, ఉపాధ్యక్షుడు చంద్రయ్య యాదవ్, ఎంపీపీ సంధ్య, జె డ్పీటీసీ భార్గవి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, ఎంఈవో శ్రీనివాసులు, ఎంపీడీవో హుస్సేనప్ప, పంచాయతీరా జ్ ఈఈ మల్లయ్య, డీఈ అశోక్, ఏఈ సుధాకర్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మతీన్, సర్పంచులు శ్రీనివాసులు, శేఖర్యాదవ్, పద్మమ్మ, నాగమణి, శంకర్నాయక్, ఎంపీటీసీలు వనజ, కేతమ్మ, శ్రీదేవి, శాంతి, బాల్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోదండం, మహిళా అధ్యక్షురాలు అనురాధ, కేజీవీబీ ప్రిన్సిపాల్ దీప్తి, నాయకులు కోటీశ్వర్రెడ్డి, రాము, లోకారెడ్డి, రాజు, జయపాల్నాయక్, శంకరయ్య, కృష్ణయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.
సర్వాయి పాపన్నగౌడ్ విప్లవ దీరుడు..
వనపర్తి, ఆగస్టు 18 : అణచివేతపై తిరుగుబాటు చేసిన విప్లవ దీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాపన్న 372వ జ యంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకల ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాల వద్ద స్థానిక నాయకులతో కలిసి మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని అన్నారు. గీ త వృత్తిని నమ్ముకుని జీవిస్తూ సైనికుల ఆగడాలపై ఎదురుదాడి చేసిన వీరుడని కొనియాడారు. సొంతంగా సైని క బలగాన్ని ఏర్పర్చుకొని జనగామ నుంచి గోల్కొండ వరకు 20 కోటలను జయించాడని తెలిపారు. అక్రమ శిస్తులను కొల్లగొట్టి పేదలకు పంచిన మానవతావాది అని అన్నారు.
ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని చెప్పా రు. మన సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. సంపద పెంచాలి.. పేదల కు పంచాలన్నదే సీఎం కేసీఆర్ విధానమన్నారు. అంతకుముందు పెద్దమందడి మండలానికి చెందిన 77 మంది బాధితులకు రూ.24 లక్షల సీఎంఆర్ఎఫ్, 25 మంది లబ్ధిదారులకు రూ.లక్షా 116 చొప్పున చెక్కుల ను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మ న్ లోకనాథ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.