ఫొటో అంటే నోటితో చెప్పలేని ఎన్నో భావాలకు దృశ్యరూపం.. మరపురాని మధుర స్మృతులను కళ్ల ముందుంచేది. ఒక అందమైన దృశ్యాన్ని బంధించి కలకాలం పదిలంగా దాచుకొనేది. వందల ఏండ్ల నాటి చరిత్రను, దృశ్యాలను ముందు తరాలకు అందించేది.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో జ్ఞాపకాలకు శాశ్వత రూపమని చెప్పొచ్చు. ఊహలకు అందని ఓ అందమైన ప్రపంచం. మానవాళి జ్ఞాపకాల దొంతరలను తట్టిలేపే అంతటి శక్తి ఒక్క ఫొటోగ్రఫీకే ఉంటుంది. వందల ఏండ్ల కిందట భారత స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన గొప్ప సమరయోధుల చిత్రాలు, వారి జ్ఞాపకాలు నేటి తరం వారు చూస్తున్నారంటే ఈ దృశ్యాలే కారణం.అదొక అందమైన ప్రపంచం. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీడే సందర్భంగా కథనం..
బాలానగర్/కొత్తకోట, ఆగస్టు 18 : ఓ చిత్రం వంద మాటలకు సమానం. సమస్య అయినా.., ఒకరి దీనస్థితి అయినా ఇట్టే వివరించే ఆస్కారం ఫొటోలకే ఉన్నది. అలాగే ఏనాడో జరిగిన శుభకార్యాలు, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతాయి. ఏ ప్రాంతానికెళ్లి నా.. ఏ అందమైన దృశ్యం కంటబడినా.. కెమెరా లో ఇట్టే బంధించొచ్చు.. కన్ను తెరిచింది మొద లు… కన్ను మూసే వరకు ప్రతి విషయం ఒక జ్ఞాప కం.
ప్రతి పరిచయం ఒక మధురం.. ఆ జ్ఞాపకాల దొంతరలు, కాలగర్భంలో కలిపిపోయిన ఎన్నో వి షయాలను మళ్లీ కండ్ల ముందుకు తీసుకురావాలంటే.. అది ఒక్క ఫొటోతోనే సాధ్యం. ఎన్నో జ్ఞాపకాలకు శాశ్వత రూపం ఫొటో అని చెప్పొచ్చు. ఫొ టోగ్రఫీ అనేది ఊహలకందని ఒక అందమైన ప్ర పంచం. వందల ఏండ్ల కిందట భారత స్వా తంత్య్రం కోసం పోరాటాలు చేసి ప్రాణాలర్పించిన గొప్ప గొప్ప వారి చిత్రాలు, జ్ఞాపకాలు నేటితరం వారు చూస్తున్నారంటే ఈ ఫొటోలే కారణం. మన జీవితంలోనే గొప్ప సందర్భాలైనా బాల్యం, స్నే హం, చీకటి, వెలుగులు, కొత్త బంధాలు, పరిచయాలు, ప్రతి మధురానుభూతికి సాక్షీభూతంలా ఛాయాచిత్రాలు నిలుస్తాయి.
చరిత్రను కండ్లకు కట్టినట్లు సజీవంగా చూపించేది ఏదైన ఉందంటే అది ఒక్క ఫొటోగ్రఫీ మాత్రమే. మనముందు తరాల వారు, ఆ ముందు తరాల వారు ఎలా ఉన్నారనడానికి సాక్ష్యం ఫొటోలు మాత్రమే. ఫొటో ఒక జీ వం లేని సాక్ష్యం. చాలా సందర్భాల్లో ఎన్నో సాక్ష్యాలుగా నిలబడ్డాయి. ఒక్కప్పుడు కెమెరాలపై నల్లటి బట్టలు వేసి కెమెరా మూతలు తీసి ఫోటోలు తీసే కాలం నుంచి నేడు సెల్ఫోన్లోనే ఫొటోలను ఎ డిట్ చేసుకునే స్థాయికి టెక్నాలజీ పెరిగిందంటే అతిశయోక్తి కలగకమానదు. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ఫొటోగ్రాఫర్లందరూ తమ పండుగగా జరుపుకొంటారు.
గతంలో శుభకార్యాలు పెట్టుకుంటే ముందుగా ఫొ టోగ్రాఫర్లను బుక్ చేసుకునేవారు.. కానీ నేడు టె క్నాలజీ పెరగడంతో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ తప్పా మరే ఇతర శుభకార్యాలకు ఫొటోగ్రాఫర్లను పిలవడం లేదు. ఎందుకంటే సాంకేతికత పెరగడంతో డిజిలైజేషన్ విప్లవం రావడంతో ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలామంది సొంత కెమెరాలను తెచ్చి ఫొటోలను తీసుకుంటున్నారు. చరిత్రను చూపించిన ఫొటోగ్రాఫర్లు నేడు కూటికి లేక విలవిలలాడుతున్న దుస్థితి కనబడుతున్నది.
ఫొటోగ్రఫీ చరిత్ర..
పారిస్కు చెందిన జోసెఫ్మియాప్స్ తొలిసారి లోహఫలకంపై దృశ్యాన్ని నిలపగలిగాడు. 1839లో మొట్టమొదటిసారి సర్జాన్ హెల్లర్ ఫొటోగ్రఫీని ఉపయోగించారు. 1941లో విలియం హెన్రీఫాక్స్ ఫొటోగ్రఫీకి మూలమైన పాజిటివ్ ఫిల్మ్లను కొనుగొన్నాడు. మొదట సూర్యరశ్మిని ఉపయోగించి ఫిల్మ్లను కడిగేవారు. కాలక్రమేణా విద్యుత్శక్తి ద్వారా ఫొటోలను తీయడం, ప్రింటింగ్ వంటివి చేశారు. అప్పట్లో నలుపు, తెలుపు ఫొటోలు మాత్రమే అందుబాటులో ఉండేవి. 1980 దశకంలో కలర్ ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది.
19వ శతాబ్దం చివర డిజిటల్ ఫొటోగ్రఫీ అడుగుపెట్టింది. ఆటోమెటిక్ కెమెరాలు, అత్యధిక రెజ్యులేషన్ ఉన్న లెన్స్లతో రకరకాల డిజిటల్ కెమెరాలు మార్కెట్లోకి వచ్చాయి. డిజిటల్ ఫొటోగ్రఫీ అడుగుపెట్టాక ఫొటోలు తీయడం సులభంగా మారడంతో చాలా మంది నిరుద్యోగులు దీనినే వృత్తిగా మార్చుకొని ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ ఫొటోగ్రఫీకి ప్రస్తుతం క్రేజ్ ఉన్నది. సాధారణంగా ఒక పెళ్లికి ఫొటోలు తీసి ఆల్బమ్ రూపొందిస్తే రూ.30వేల నుంచి రూ.40 వేలు అవుతుంది. అయితే అధునాతన కెమెరాలు, లైటింగ్ ప్రత్యేక సెట్టింగ్లతో ఫొటోషూట్ చేస్తే రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
సెల్ఫోన్లు అడుగుపెట్టినప్పుడు 1.3 లేదా 2 మెగా పిక్సెల్ కెమెరాలు మాత్రమే ఉండేవి. క్రమంగా 3జీ, 4జీ, 5జీ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో సెల్ఫోన్లలో సైతం అత్యధిక మెగా పిక్సెల్ కెమెరాలను నిక్షిప్తం చేస్తున్నారు. దీంతో చిత్రాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. ఇక చిన్న శుభకార్యం జరిగినా సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకొని పదిల పరుచుకుంటున్నారు.