సమస్తే తెలంగాణ, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. పలుచోట్ల 75 మీటర్ల పొడవున్న జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు గ్రామాల్లో పురవీధుల చుట్టూ జాతీయ జెండాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రోడ్ల్లన్నీ త్రివర్ణశోభితంగా మారాయి. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు జాతీయ నాయకుల ఫొటో ప్రద్శనలో పాల్గొని నినాదాలు చేశారు. అలాగే విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. మక్తల్, నారాయణపేటలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన ర్యాలీలను ప్రారంభించి ఎంతోమంది త్యాగధనుల పోరాటాల వల్ల ప్రస్తుతం మనం స్వేచ్ఛా స్వతంత్య్రాలు అనుభవిస్తున్నామని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రగతికి ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.