‘నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనిద్దరం దేశానికి రక్ష.. ఒకరికొకరం రక్ష’.. అంటూ అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు రక్షా బంధన్ పండుగ ప్రత్యేకతను చాటి చెప్పారు. అన్నాతమ్ముళ్లకు అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు తీసుకొని ఆత్మీయతను పంచుకున్నారు. శుక్రవారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని రక్షా బంధన్ను ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తల్లిగారింటికీ వచ్చిన ఆడపడుచులు, బంధువులతో గ్రామాలు సందడిగా మారాయి.
ప్రయాణ ప్రాంగణాలు, బస్సులు కిటకిట లాడాయి. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీలు కట్టారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్కు, వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డికి వారి సోదరీమణులు, టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులకు చిన్నారులు, మహిళలు రాఖీలు కట్టారు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, ఆగస్టు 12