జడ్చర్లటౌన్, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జడ్చర్ల పట్టణంలో శుక్రవారం ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీచౌరస్తా నుంచి అంబేద్కర్చౌరస్తా వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈవో మంజులాదేవి, ట్రస్మా అధ్యక్షుడు అయూబ్ఖాన్, కౌ న్సిలర్లు ప్రశాంత్రెడ్డి, ఉమాశంకర్గౌడ్, నం దకిశోర్గౌడ్, రమేశ్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ పట్టణంలో..
మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆల్ పార్టీ ముస్లిం లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాల తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మ రించుకున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 5వ వార్డు ఏనుగొండలో డీసీసీబీ వైస్చైర్మన్ కొ రమోని వెంకటయ్య, కౌన్సిలర్ వనజ జాతీ య జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ఇసాక్, ఆల్పార్టీ ముస్లిం లీడర్స్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ మోసిన్కాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, అబ్దుల్హదీ, జాకీర్ అడ్వకేట్, సమాద్ఖా న్, జకీ, జహంగీర్బాబా, షబ్బీర్, ఇద్రీస్, ఇబ్రహీం, నూరుల్హాసన్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
పాలమూరు, ఆగస్టు 12 : మండలంలో ని గాజులపేట, కోటకదిర తదితర గ్రామా ల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచులు, కోఆప్షన్ స భ్యుడు మస్తాన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహులు పాల్గొన్నారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, ఆగస్టు 12 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో స్వతం త్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణతోపాటు అంగన్వాడీ టీచ ర్లు, ఆశ కార్యకర్తలు, పింఛన్దారులు ము ఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టా రు. పుట్టపల్లి సింగిల్విండో గోదాము ఆవరణలో సర్పంచ్ శ్రీనివాసులు, చైర్మన్ నరేందర్రెడ్డి, డైరెక్టర్ కృష్ణగోపాల్ రైతులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే పలు గ్రామాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, ఆగస్టు 12 : మండలంలోని జూలపల్లి, నంచర్ల, మహ్మదాబాద్, మొకర్లాబాద్, వెంకట్రెడ్డిపల్లి, కంచన్పల్లి, గాధిర్యాల్, చౌదర్పల్లి, మంగంపేట గ్రామా ల్లో జాతీయ జెండాలను పం పిణీ చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటాలని సర్పంచులు కోరారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా వెన్నాచేడ్లో స్టార్ యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్టార్ యూత్ అధ్యక్షుడు ఇమ్రాన్, అక్బర్, యూసుఫ్, సర్థార్, అజీమ్, అమేర్, ఆరిఫ్, తాహేర్, షకీల్, ఖ లీల్, మెహీబ్, రియాజ్, ముస్తఫా, అంరో జ్, ఇమ్రాన్, ముదబీర్, ముదసీర్ ఉన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, ఆగస్టు 12 : స్వతంత్ర భా రత వజ్రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో మైనార్టీల ఆధ్వర్యంలో జాతీయజెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమం లో మసీదు కమిటీ అధ్యక్షుడు మైనొద్దీన్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్జమీర్, కలీం, సలాం, ఖాదర్, ఖలీల్, శెట్టి శ్రావణ్కుమా ర్, నారాయణ పాల్గొన్నారు.