అలంపూర్, ఆగస్టు 12 : సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమై న అలంపూర్ అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆలయాల ఆవరణలో హేమలాపురి సదన్, దక్షిణ కాశీభవన్ వసతి గృహాలను ఎంపీ రా ములు, రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నాథం, ఎ మ్మెల్యే అబ్రహం, జెడ్పీచైర్పర్సన్ సరితాతిరుపతయ్య, కలెక్టర్ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అంతకుముందు వారికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో పురేందర్కుమార్, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మం త్రి మాట్లాడుతూ దర్శనీయ స్థలాలు నిత్యం ఓ కొత్తదనంతో కనిపించాలన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి వ చ్చే భక్తుల కోసం అవసరమైన ఈ భవనంపై మరో అం తస్తు నిర్మించనున్నట్లు తెలిపారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. పరిశుభ్రత కోసం ఎంపీ, ఎమ్మెల్యే నిధుల నుంచి పది శాతం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రశ్నించే తత్వం ఉంటేనే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మరోసారి అలంపూర్కు వచ్చే నాటికి పరిసరాల్లో కంప చెట్లు లేకుండా శుభ్రంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్, చైర్పర్సన్ మనోరమను ఆదేశించారు. పర్యవేక్షించాలని ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్కు సూచించారు. అంతకుముందు వసతి గృహంలో నిర్వహించిన హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.