ఊట్కూర్, ఆగస్టు 9 : యుద్ధంలో మరణించిన మహ్మద్ ప్ర వక్త మనువలు హసన్, హుస్సేన్ త్యాగానికి గుర్తింపుగా నిర్వ హించుకునే మొహర్రం (పీర్ల పండుగ) ఉత్సవ వేడుకలకు వివి ధ రాష్ర్టాలు, పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మొహర్రం వేడుకలను పురస్కరించుకుని మండలకేంద్రంతోపాటు పరిసర గ్రామాలు పెద్దజట్రం, పగిడిమర్రి, చిన్నపొర్ల గ్రామాల్లో భక్తులు పీర్ల చావిడిలను దర్శించుకున్నారు. ఉ మ్మడి జిల్లాలోనే అత్యంత చరిత్ర కలిగిన ఊట్కూర్ హసన్-హుస్సేన్ పీర్ల చావిడిని దర్శించుకునేందుకు భక్తులు కుల, మ తానికతీతంగా వచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చె ల్లించుకున్నారు. పెద్దపీర్ల మసీదు నుంచి మేన్బజార్, భరత్నగర్, శివాజీనగర్ ప్రాంతాల నుంచి కొనసాగిన ఊరేగింపులో భక్తులు చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా పాల్గొన్నారు. యువకులు అలై బలై, అసైదులా నినాదాలతో హోరెత్తించగా మహిళ లు బొడ్డెమ్మలతో ఆకట్టుకున్నారు.
పీర్ల చావిడిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిట్టెం
ఊట్కూర్ హసన్, హుస్సేన్ పీర్ల చావిడిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఊరేగింపుగా వచ్చి దర్శించుకున్నారు. హసన్ హుస్సేన్లకు ఫాతియా, దట్టీలు సమర్పించుకున్నారు. నిర్వాహకులు ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులను దట్టీలతో సన్మానించారు. కులమతాలకతీతంగా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, ఉపసర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, నాయకులు నారాయణరెడ్డి, వెంకట్రామారెడ్డి, అరవింద్కుమార్, శంకర్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఈశ్వర్యాదవ్, శివరామరా జు, వెంకటేశ్గౌడ్, నాసీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న డోలారోహణం
పీర్ల సవారీ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన డోలారోహణం (తొట్ల) కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉద యం, సాయంత్రం వేళ నిర్వహించిన తొట్ల కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పిల్లాపాపలతో తరలివచ్చారు. స్థానిక రుద్రనగర్లో ఆరెకటిక వంశంలో పుట్టిన పసిబిడ్డలను ఊయల్లో వేశా రు. పీర్ల సవారీ ఎత్తిన వారితో పిల్లలకు పేర్లు పెట్టించారు. వేడుకలకు హాజరైన భక్తులు పోటీపడి ప్రసాదం దక్కించుకున్నారు. ప్రసాదం దక్కిన భక్తులకు సంతాన యోగ్యత కలుగుతుందని విశ్వసిస్తారు. రాత్రికి స్థానిక పెద్దచెరువు అలుగు కట్టపై పీర్ల అలా య్ బలాయ్ ఆటలతో వేడుకలకు ముగింపు పలికారు. పేట డీ ఎస్పీ సత్యనారాయణ, మక్తల్ సీఐ సీతయ్య, ఎస్సై రాములు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేశారు.
ముగిసిన మొహర్రం వేడుకలు
మరికల్, ఆగస్టు 9 : మండలకేంద్రంతోపాటు మధ్వార్, తీలేరు, చిత్తనూర్, కన్మనూర్, పెద్దచింతకుంట, రాకొండ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పీర్ల పండుగ మంగళవారంతో ఘనంగా ముగిసింది. ఉద యం మరికల్కు మధ్వార్ పీర్లు వచ్చి అలాయ్..బలాయ్ తీసుకున్నాయి. అ నంతరం మధ్వార్లో యువకులు అలాయ్..బలాయ్ ఆడుతూ ఉత్సవాలకు ముగింపు పలికారు. మొహర్రం పండుగ ప్రశాంతంగా ముగిసింది.
కృష్ణ మండలంలో…
కృష్ణ, ఆగస్టు 9 : మండలంతోపాటు హిందూపూర్, మూడుమాల తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలు మంగళవారం తో ముగిశాయి. కులమతానికతీతంగా వచ్చి పీర్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో పీర్ల ఊరేగింపు సందర్భంగా యువకులు అలాయ్..బలాయ్ ఆడు తూ ఉత్సవాలకు ముగింపు పలికారు.
కోస్గి మండలంలో…
కోస్గి, ఆగస్టు 9 : మత సామరస్యానికి నిదర్శనమైన మొహ ర్రం వేడుకలు మంగళవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు అంగరంగవైభవంగా జరుపుకొన్నారు. గ్రామాల్లో యు వకులు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా పీర్ల ఎదుట అ లాయ్..బలాయ్ ఆడడంతోపాటు మహిళలు బొడ్డెమ్మలు వేశా రు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
గుండుమాల్ మండలంలో…
గుండుమాల్, ఆగస్టు 9 : మండలంలోని కోమ్ముర్లో మంగళవారం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే పీర్ల పండుగను హిందూ, ముస్లింలు సోదరభావంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలో పీర్ల చావిడిలో ప్రతిష్ఠించిన పీర్లకు భక్తు లు పూజలు చేశారు. అనంతరం పీర్ల చావిడి నుంచి గ్రామంలో వీధుల మీదుగా పీర్లను ఊరేగింపు నిర్వహించగా భక్తులు పీర్లకు తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ సమీపం బావిలో నిమజ్జనం చేశారు.
నారాయణపేట మండలంలో…
నారాయణపేట రూరల్, ఆగస్టు 9 : మండలంలోని కొల్లంపల్లి, జాజాపూర్, కోటకొండతోపాటు తదితర గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున దస్మి సవారీని ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. గ్రామాల్లోని చావిడిల వద్ద ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు. ముస్లిం, హిందూవులు కలిసి జరుపుకొనే వేడుకల సందర్భంగా ఒకరినొక్కరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.