మక్తల్టౌన్, జూలై 20: గొర్రెలకు నీలినాలుక వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నామని, గొల్లకురుమలు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్ సురేఖ అన్నారు. మున్సిపల్ పరిధిలోని గొర్రెలకు బుధవారం నీలినాలుక నివారణ టీకాలు వేసినట్లు డాక్టర్ సురేఖ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటున్నారన్నారు. గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు ఇవ్వడంతోపాటు వాటి సంరక్షణకు టీకాలు వేస్తున్నారన్నారు. జిల్లాలోని గొర్రెలకు నీలినాలుక నివారణ టీకాలు వేయించాలని అధికారులకు సూచించారు. పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రతి గ్రామంలో టీకాలు వేస్తున్నారని, గొర్రెల పెంపకందారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ మిరాజ్, పశు సహాయకుడు దివాకర్, గొర్రెల పెంపకందారుల అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, రంగప్ప, లింగం, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట మండలంలో..
నారాయణపేటరూరల్, జూలై 20: మండలంలోని సింగా రం, జాజాపూర్, అప్పిరెడ్డిపల్లిలో బుధవారం గొర్రెలకు నీలినాలుక నివారణ టీకాలు వేశారు. జాజాపూర్లో సర్పం చ్ కోట్ల సుగందమ్మ టీకాలు వేశారు. కార్యక్రమంలో డాక్టర్ అనిరుధ్ఆచార్య, నాయకులు నారాయణరెడ్డి, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్మీపూర్, బోయిన్పల్లి, కొల్లంపల్లిలో గురువారం టీకాలు వేయనున్నట్లు తెలిపారు.