మహబూబ్నగర్: సహకార బ్యాంకుల ద్వారా నిరుపేదలకు మరింత మేలు జరిగేలా పాలకవర్గ సభ్యులు చర్యలు తీసు కుంటూ ముందుకు సాగాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ప్రధా న కార్యాలయంలోని సమావేశ మందిరం నందు డీసీసీబీ మహజన సభను డీసీసీబీ అధ్యక్షుడు నిజాం పాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. బ్యాంక్ సీఈవో పురుషోత్తంరావు 101 వార్షిక నివే దికను మహజన సభ్యుల మందు ఉంచారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేదికలను రూ.21 లక్షల 73 లాభం రావడం సంతోషకరమన్నారు. రికార్డు స్థాయిలో రుణాలు అందించడం మంచి విషయమని, గడిచిన వార్షిక రుణ ప్రణాళికకు సంబంధించి స్వల్పకాలిక రుణాలు రూ.77,546,97 లక్షలు, దీర్ఘకాలిక రుణాలు రూ.2681. 65 లక్షలు బట్వాడ చేయడం మంచి విషమని తెలిపారు. డీసీసీబీ పట్టణంలోని ఎంతో మందికి అండగా నిలుస్తు చిరు వ్యాపారులకు సైతం రుణాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
రైతులకు మరింత చేరువగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం బ్యాంకులు పనిచేయాలని తెలియజే శారు. వరికోత మిషన్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ వరి కోత మిషన్కు రూ.28లక్షలు ఖర్చు కాగా చేగూర్ సహకార సంఘం పదిశాతం డబ్బులు చెల్లించగా 90 శాతం డీసీసీబీ భరించడం జరిగిందని సంబంధింత అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో సీఈవో పురుషోత్తంరావు, వైస్ ప్రెసిడెంట్ కొరమోని వెంకటయ్య, పాలక వర్గ సభ్యులు విష్ణువర్ధన్రెడ్డి, మంజులరెడ్డి, రఘునందన్రెడ్డి, బక్కన్నయాదవ్, రంగారెడ్డి తదితరులు ఉన్నారు.