ఆత్మకూరు, మే 21 : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కరోనా పరీక్ష రాయాల్సిందేనని సీఐ సీతయ్య తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు, అమరచింతలలో లాక్డౌన్ అమలును పరిశీలించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని కూర్చోబెట్టి కరోనా పరీక్ష రాయించారు. పరీక్షలో కొవిడ్ నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నియమాలు, ఎండల తీవ్రతతో ఇక్కట్లు, సంభవిస్తున్న మరణాలపై ప్రశ్నలు ఉన్నాయని సీఐ తెలిపారు. పరీక్షలో పేర్కొన్న అంశాలు నిజజీవితంలోనూ అనుసరించాలని సూ చించారు. సీఐ సీతయ్య వినూత్నంగా పరీక్ష రాయించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్కుమార్, ముత్తయ్య, సిబ్బంది పాల్గొన్నారు.