ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేసిన రోగి బంధువు
ప్రభుత్వ జనరల్ దవాఖానలో కార్పొరేట్ వైద్యం
పంచవటి దవాఖానను తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అం దించేందుకు వినియోగిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో కరోన రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహబూబ్నగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో కొవిడ్ చికిత్సకు పెద్ద ఎత్తున ఫీజులు వసూ లు చేస్తున్నారని రోగి బంధువులు మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్లో పరిస్థితిపై సమీక్షించమని.. మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్కు ట్విట్టర్ ద్వారా సమాచారం అందించారు. స్పందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంటనే మహబూబ్నగర్ చేరుకొని ప్రైవేటు దవాఖానాల్లో వైద్యం అందుతు న్న తీరు, ఫీజుల వసూళ్లపై రోగుల బంధువులతో మాట్లాడారు. భూత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి హాస్పిటల్లో కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన రోగి బంధువులతో మాట్లాడారు. అక్కడ అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. కరోనా వార్డు, రోగులకు అందిస్తున్న చికిత్స, పరీక్షలు, బిల్లులు తనిఖీ చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో హైదరాబాద్ స్థాయిలో అత్యాధునిక వైద్య సేవలు అం దిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా జనరల్ దవాఖానలో 500 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. కరోనా వచ్చిందని తెలియగానే కంగారుపడి దవాఖానాల్లో చేయొద్దని సూచించారు. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా మేరకు చికిత్స పొందాలని తెలిపారు. ప్రైవేట్ దవాఖానాల్లో పేద ల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయవద్దని మానవత్వంతో స్పందించి తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందించాలని మంత్రి సూచించారు. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థాయిలో లేని రోగి వచ్చినప్పుడు సకల సదుపాయాలు ఉన్న జనరల్ దవాఖానకు రోగిని పంపించాలని ప్రైవేటు దవాఖానలను మంత్రి కోరారు. ప్రభుత్వ జనరల్ ద వాఖానలో పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్య సదుపాయం అందిస్తున్నామని, రెమ్డెసివి ర్, ఆక్సిజన్, వెంటిలేటర్ పడకలు అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. జనరల్ దవాఖాన తర్వాత ఎస్వీఎస్ మెడికల్ కళాశాల దవాఖాన లో నూ 350 పడకలతో తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయం అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ట్విట్టర్లో ఫిర్యాదు వస్తే పంచవటి ద వాఖానలో తనిఖీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఫిర్యాదు చేసిన రోగి బంధువులతో మాట్లాడమని వైద్యం బాగా అందుతోందని చెప్పారని మంత్రి అన్నారు. ప్రైవేటు దవాఖానకంటే ప్రభుత్వ జనర ల్ దవాఖానలో అద్భుతమైన వైద్యం అందుతోందని కరోనా వచ్చిన రోగులు, వారి బంధువులు ఇది గమనించాలని కోరారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కృష్ణ, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు ఉన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
మహబూబ్నగర్ టౌన్, మే 16 : జిల్లా కేం ద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. క్లాక్టవర్, తెలంగాణ చౌరస్తా జంక్షన్ పనులతోపాటు అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తి చే యాలని, జంక్షన్, రోడ్డు విస్తరణ పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే డీఈవో, సద్దలగుండు, తెలంగాణ చౌరస్తా పను లు పూర్తి చేశామని, క్లాక్టవర్ చౌరస్తా పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.
నిబంధనలు పాటించేలా చూడాలి..
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 16 : మెడికల్ దుకాణానికి మందుల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. ఆదివారం పట్టణంలోని క్లాక్టవర్లో ఉన్న మెడికల్ దుకాణాల్లోని మందులను పరీశీలించారు. మం త్రి వెంట ఏడీ నందలాల్పవార్ ఉన్నారు.