ఘర్…ఘర్ మే రంజాన్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా ‘ఈద్’
కొవిడ్ నిబంధనలతో వేడుకలు
నెట్వర్క్, మే14 (నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుపుకొన్నారు. లాక్డౌన్ నిబంధనలు అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ ఇండ్లల్లోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదుల్లో మత పెద్దతోపాటు మరో ముగ్గురు మాత్రమే నమాజ్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలు, ఆత్మీయ అలింగనాలు లేకుండా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మహబూబ్నగర్ టౌన్, మే 14 : సామూహిక ప్రార్థన లు, ఆత్మీయ ఆలింగనాలు లేకుండా ముస్లింలు శుక్రవారం రంజాన్ పర్వదినాన్ని నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకొన్నారు. ఏటా కొత్త దుస్తులు ధరించి అత్తర్ల సువాసనతో ఈ ద్గాకు వెళ్లే ముస్లింలు.. ఈ ఏడాది లాక్డౌన్ నేపథ్యంలో ప్ర భుత్వం సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకున్నా రు. మసీదుల్లో ఇమామ్, మౌజన్తోపాటు మరో ఇద్దరు త ప్పా మిగతా వారంతా ఈద్ నమాజ్ ఇండ్లల్లోనే పాటించా రు. ప్రతి ఇంటా తమ కుటుంబ సభ్యులతో కలిసి నమాజ్ చేసుకున్నారు. అనంతరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నిబంధనలు కొనసాగుతుండడం వల్ల పట్టణవాసులు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉం టున్న మిత్రులకు ఫోన్లలోనే శుభాకాంక్షలు చెప్పారు. వాట్సాప్లలో డిజైన్ చేసి పంపించుకున్నారు.
ఇండ్లల్లోనే వేడుకలు
జడ్చర్ల, మే 14 : రంజాన్ పండుగను ముస్లింలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కొవిడ్ కారణంగా అందరూ ఇండ్లల్లోనే రంజాన్ పండుగ నిర్వహించారు. తెల్లవారుజామున మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
రంజాన్ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనావేళ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇండ్లల్లోనే పండుగ జరుపుకోవాలని కోరారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మే 14 : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు ఇండ్లలోనే ప్రార్థనలు చేశారు. కరోనా విస్తరిస్తుండడంతో రంజాన్ పర్వదినాన్ని నిరాడంబరంగా నిర్వహించారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మే 14 : మండలంతోపాటు వాడ్యాల్, మసిగుండ్లపల్లి, రాణిపేట, వేముల, బోయిన్పల్లి తదితర గ్రామా ల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకొన్నా రు. కొవిడ్ నిబంధనల మేరకు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, మే 14 : రంజాన్ వేడుకలను ముస్లిం లు నిరాడంబరంగా జరుపుకొన్నారు. కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇండ్లల్లోనే ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారి తొందరగా హంతం కావాలని, ప్రజలు సంపూ ర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
మూసాపేట, అడ్డాకుల మండలాల్లో..
మూసాపేట(అడ్డాకుల), మే 14 : అడ్డాకుల మండలంతోపాటు, పొన్నకల్, కందూరు, రాచాల, పెద్దమునగల్చేడ్, శాఖాపూర్, మూసాపేట మండలంతోపాటు, జానంపేట, వే ముల, తిమ్మాపూర్, పోల్కంపల్లి, చక్రాపూర్, నందిపేట, ని జాలాపూర్, మహ్మదుస్సేన్పల్లి, కొమిరెడ్డిపల్లి తదితర గ్రా మాల్లో రంజాన్ వేడుకను ముస్లింలు నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేయకుండా మసీదుల వద్ద కొంతమంది మాత్రమే మద్ద పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లింలకు జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ దోనూరు నాగార్జున్రెడ్డి, ఎంపీపీ గూపని ళావతీకొండయ్యలతోపాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మే 14 : మండలంతోపాటు పెద్దరేవల్లి, మొ దంపల్లి, చిన్నరేవల్లి, ఉడిత్యాల తదితర గ్రామాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ముస్లింలు మసీదుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొదంపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివానందరెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లతీఫ్, కోఆప్షన్ సభ్యుడు జమీర్పాషా, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, జహంగీర్పాషా, షమీర్ షరీఫ్, నసీర్, సలీమ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మే 14 : మండలంతోపాటు కుచ్చర్కల్, చెన్నవెల్లి, తిర్మలాపూర్, ఖానాపూర్, చొక్కంపేట తదితర గ్రామాల్లో ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఇండ్లల్లోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ము స్లింలకు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్లో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, మే 14 : మండలంతోపాటు వివిధ గ్రామా ల్లో ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లోని ఈద్గాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేశారు. నవాబ్పేట, యన్మన్గండ్ల, కారుకొండ, కాకర్లపహాడ్, ఇప్పటూర్, కారూర్, పో మాల, కొల్లూరు, లింగంపల్లి, లోకిరేవు, మరికల్ తదితర గ్రామాల్లో రంజాన్ ఉత్సవాలను జరుపుకొన్నారు.
ఊట్కూర్ మండలంలో..
ఊట్కూర్, మే 14 : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రంజాన్ పర్వదిన వేడుకలను అన్ని గ్రామా ల్లో ముస్లింలు ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుం డా జరుపుకొన్నారు. ఇండ్లల్లోనే ప్రార్థనలు చేశారు. ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, మే 14 : మండలంలోని గుడెబల్లూర్, కృష్ణ, హిందుపూర్, ముడుమాల తదితర గ్రామా ల్లో రంజాన్ పండుగను జరుపుకొన్నారు. ఇండ్లల్లో నే ప్రార్థనలు చేసుకున్నారు. కరచాలనం, ఆత్మీయ ఆలింగనాలు పాటించకుండా, ఫోన్లో సోషల్ మీ డియా సందేశాలతో బంధు మిత్రులకు శుభాకాంక్ష లు తెలుపుకొన్నారు. రంజన్ సందర్భంగా టీఆర్ఎ స్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
మక్తల్ మండలంలో..
మక్తల్ టౌన్, మే 14 : మక్తల్లో ముస్లింలు రంజాన్ పండుగను నిర్వహించారు. పట్టణంలోని జామియా, నూర్మసీద్, రహ్మానియా, ఫైజులూమ్ , షరీఫా మసీదుల్లో మత పెద్దలు ప్రార్థనలు చేయగా మిగతా ముస్లింలు తమ ఇండ్లలోనే రంజాన్ వేడుకలు నిర్వహించుకున్నారు. కుటుంబ స భ్యులతో కలిసి ప్రార్థనలు చేసి రకరకాల వంటకాలు చేసి ఆ రగించారు. కార్యక్రమంలో మతపెద్దలు నసీరుద్దీన్ రషియా ది, బుక్క శంషొద్దీన్, జహీర్, సోయబ్ తదితర ముస్లింలు పాల్గొన్నారు.
ధన్వాడ్ మండలంలో..
ధన్వాడ, మే 14 : ధన్వాడలో రంజాన్ వేడుకలను కొవి డ్ నిబంధలనలను పాటిస్తూ జరుపుకొన్నారు. ఈద్గా వద్ద ప్రార్థనలు చేయకుండా ఇంటి వద్దనే ప్రార్థనలు నిర్వహించా రు. పలువురు నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మరికల్ మండలంలో..
మరికల్, మే 14: లాక్డౌన్ నేపథ్యంలో రంజాన్ పండు గ సందర్భంగా ముస్లింలు తమతమ ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలు చేసి నిరాడంబరంగా పండుగ చేసుకున్నారు. కరో నా ఎఫెక్టుతో రంజాన్ సందడి కనిపించలేదు, ముస్లింలు తమతమ ఇండ్లలోనే నమాజ్ చే సుకొని ఇంటి పక్కల వారికి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ప్రస్తుతం ఆ సందడి ఎక్క డా కనిపించలేదు.
కోస్గి మండలంలో..
కోస్గి, మే 14 : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో ముస్లింలు ఘనంగా పండుగను జరుపుకొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నారులు కరికొకరు ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు.