2014లో ఐసీయూ, వెంటిలేటర్లు లేవు
ప్రస్తుతం 500పడకల ఆక్సిజన్, 60వెంటిలేటర్ బెడ్లు
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి లార్డ్స్ చర్చి ఆధ్వర్యంలో కేటాయించిన రెండు ప్రత్యేక మొబైల్ బస్సులు
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 11 : మహబూబ్నగర్ జిల్లా రాబోయే రోజుల్లో మెడికల్ హబ్గా మారనున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎం బీసీ చర్చి ఆవరణలో లార్డ్స్ చర్చి ఆధ్వర్యంలో రాజ్ ప్రకాశ్ పాల్ ద్వారా కరోనా నియంత్రణకు జిల్లాకు కేటాయించిన ఐ సోలేటెడ్ ఐసీయూ, ఆక్సిజన్తో రూపొందించిన రెండు బస్సులను ఎంపీ మన్నె శ్రీ నివాస్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌ డ్ మాట్లాడుతూ ప్రతి మనిషి సేవా భావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చా రు. ఎందరో క్రిస్టియన్లు నర్సులుగా పనిచేస్తూ సేవ చేస్తున్నారని చెప్పారు.
కరోనా సమయంలో రాజ్ప్రకాశ్ పాల్ లార్డ్స్ చ ర్చి ద్వారా అందించిన ఐసోలేషన్ ఆక్సిజ న్ బస్సులను పల్లె ప్రాంతాల్లో 5, 6 కేసు లు ఉన్నచోట ఉపయోగించాలని సూచించారు. 2014లో మహబూబ్నగర్లో ఎ లాంటి ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యాలు ఉండేవి కావన్నారు. ఇప్పుడు జిల్లా కేం ద్రంలో 500 పడకలతోపాటు, ఆక్సిజన్, 60 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యం కోసం ఇతర ప్రాంతా ల నుంచి ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. మెడికల్ కళాశాలకు నర్సింగ్ కళాశాల కూ డా మంజూరైందని, 400 ఎకరాల్లో ఐటీ పార్కు నిర్మాణంలో ఉన్నదని తెలిపారు. అనంతరం ఎంపీ మన్నె మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించి విపత్తును ఎదుర్కొనేందుకు కృషి చేయాలన్నారు. ఎంబీసీ చ ర్చి ఆధ్వర్యంలో ఐసోలేటెడ్, ఐసియూ, ఆక్సిజన్ బస్సులను ఇవ్వడంపై అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చై ర్మన్ నర్సింహులు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శామ్యూల్, పాథర్ రెవరెండ్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ప్రజారోగ్య శాఖ ఈఈ విజయ్ భాస్కర్రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి టైటాస్ పాల్ ఉన్నారు.
సుందరం.. సుమధురంగా.. పాలమూరును తీర్చిదిద్దుతాం
మహబూబ్నగర్ టౌన్, జూన్ 11 : పాలమూరు పట్టణాన్ని సుందరంగా.. సుమధురంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట, బీకే రెడ్డి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం, వీరన్నపేటలో ముస్లిం శ్మశాన వాటిక పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంత రం కొనసాగుతాయని చెప్పారు. జడ్చర్ల-మహబూబ్నగర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావచ్చాయని, ఇప్పటికే చౌరస్తాల సుందరీకరణ పనులు చేపట్టామని, మి గతా చౌరస్తాలను కూడా త్వరలో అభివృ ద్ధి చేస్తామన్నారు. హిందు, ముస్లిం, క్రైస్తవులకు శ్మశాన వాటికలకు స్థలం కేటాయించామని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పె ద్ద చెరువును మినీ ట్యాంక్బండ్గా అభివృద్ధి చేశామని, శిల్పారామం, ఇండో స్టేడియం నిర్మాణం చేపడుతామని పేర్కొన్నారు. హైదరాబాద్ తరహాలో మహబూబ్నగర్ను అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం శ్రీనిలయం అపార్ట్మెంట్ వాసులు మంత్రిని గజామాలతో సన్మానించారు. కార్యక్రమలో మున్సిపల్ చైర్మన్ కేసీ న ర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు రష్మిత, మోయిన్అలీ, రాము, శ్రీనివాసులు, నా యకులు మోసిన్, చిన్న, అన్వర్పాషా త దితరులు పాల్గొన్నారు.