నారాయణపేట, జూలై 10 : పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శనివా రం పట్టణంలో పట్టణ ప్రగతి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో రోజూ ఒక కార్యక్ర మం చేపట్టడంతో సమస్యలను పరిష్కరించామని అన్నా రు. ఒకరోజూ విద్యుత్ పవర్ డేగా నిర్వహించి తుప్పుపట్టి న, ఒరిగిన విద్యుత్ స్తంభాలను మార్చామన్నారు. పట్టణ ప్రకృతి వనంలో భాగంగా 3 ఏకో పార్కులను ఏర్పాటు చే శామని, ప్రణాళికాబద్ధంగా ఇంటింటికీ చెత్త సేకరణ చేపడుతున్నామన్నారు. 3 మున్సిపాలిటీల్లో సెగ్రిగేషన్ షెడ్డుల ని ర్మాణ పనులు పూర్తి చేశామని, ఇక నుంచి సెగ్రిగేషన్ షెడ్డు ల్లో తడి చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేసేందు కు చర్యలు చేపడుతామన్నారు.
హరితహారంలో భాగంగా జిల్లాలో 48 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయి ంచినట్లు, ఇప్పటికే 55 శాతం పూర్తి చేశామని వివరించారు. జిల్లాలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేసి వోడీఎఫ్ ప్లస్ అవార్డును అందుకున్నామన్నారు.మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు పట్టణంలో వారం రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేవని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మిషన్ భగీరథ కొత్త పైప్లైన్ పనులు పూర్తి కానప్పటికీ పాత పైప్లైన్ల ద్వారా 99శా తం మందికి శుద్ధి చేసిన నీటిని అందజేస్తున్నామన్నారు. రాబోయే కొన్ని రోజుల్లో పైప్లైన్ పనులను పూర్తిచేసి శాశ్వ త పరిష్కారం చూపుతామన్నారు. టీఆర్ఎస్ పాలనను ఆదర్శంగా తీసుకొని పేట మున్సిపల్ చైర్మన్గా ప్రజలు రెం డోసారి అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, నరేందర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, అబ్రహం, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైల జ రామయ్యర్, సీడీఎంఏ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, నాయకులు, కార్యకర్తలు, పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.