పాలమూరు, మార్చి 25 : పేదల తిరుపతి అయినమ న్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి అనుసంధానమై న అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భా గంగా మొదటి రోజు సోమవారం అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అదే విధంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో అమ్మవారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతోపాటు అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. సాయంత్రం అలివేలు మంగమ్మకు గరుఢ వాహనసేవ, విమాన తేరు మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకున్నది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అలహరి మధుసూదన్కుమార్, ఈవో శ్రీనివాసరాజు, సూపరింటెండెం ట్ నిత్యానందాచారితోపాటు ఆలయ కమిటీ సభ్యులు, అ ర్చకులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.