అమ్రాబాద్, డిసెంబర్ 2 : తెలంగాణలోని పవిత్ర పు ణ్యక్షేత్రాల్లో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో దివ్య మహిమాన్విత ప్రకృతి అందాల నడు మ అలారాడుతుంటుంది. కోరిన కోర్కెలు తీర్చే స్వామి గా విరాజిల్లుతున్నాడు.
ఆలయం పక్కనే కోటగోడకు వెలసిన అమ్మవారిని కోటమైసమ్మగా భక్తులు ఆరాధిస్తారు. ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కాగా, హనుమాన్ మాలధారణ చేపట్టిన స్వాములు ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఆలయ ఆవరణలో మాలవిరమణ చేపట్టనున్నారు.
4న ఉద యం నిత్యార్చన, విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్వం, యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వరపూజ, ధ్వ జారోహణం, స్వామివారికి ఉష్టావాహనసేవ నిర్వహించనున్నారు. 5న విఘ్నేశ్వరపూజ, పంచగవ్వం, వాస్తుపూజ హోమం, రుద్రహోమం, స్వామివారి సహస్రార్చన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం, హనుమాన్ వ్రతం, సాయంత్రం నిత్యోపాసన, మన్యూసూక్తహోమం, బలిహరణ, రాత్రికి అశ్వవాహనసేవ ఉంటాయి.
6న నిత్యోపాసనములు, బలిహరణ, రా త్రికి శివపార్వతుల కల్యాణం, మంగళహారతి, గజవాహన సేవ, 7న రాత్రికి సీతారాముల కల్యాణం, గరుఢవాహన సేవ, 8న ఆంజనేయస్వామికి 108 కలశాలతో మహాకుంబాభిషేకం నిర్వహించనున్నారు. అ లాగే హనుమాన్ గాయత్రీ మహాయజ్ఞం, పూర్ణాహుతి ఉండనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాల సందర్భంగా భక్తుల కు తాగునీటి సౌకర్యం, విడిది, ద ర్శనం కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈవో రంగాచారి తెలిపారు.