ఇటిక్యాల, ఫిబ్రవరి 14 : చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టిన రోజును పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీహయగ్రీవ సమేత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయంలో బుధవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకం, విశేష అలంకరణను ఆలయ అర్చకులు భు వనచంద్ర, దినకరాచార్యులు, దత్తు, భానుమూర్తి నిర్వహించారు. అనంతరం దాదాపు 200మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు.
అయ్యపురెడ్డి భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశా రు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో వారికి ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా ఆలయ మేనేజర్ సురేందర్రాజు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఏ ర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బందితో పాటు భక్తులు పాల్గొన్నారు.