తిమ్మాజిపేట, మార్చి 12 : మద్యం వాహనాల కు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వే బిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనాలు బయటకు రాగానే ఈవే బిల్లులు లే వంటూ వాహనాలను వాణిజ్య పన్నుల అధికారులు సీజ్ చేస్తుండడంతో రెండు రోజులుగా వైస్షాప్ ఓనర్లు మద్యం లిఫ్టింగ్ నిలిపివేశారు. ఉమ్మడి మ హబూబ్నగర్ జిల్లాలో మద్యం దుకాణాలు, బార్ల ఓనర్లు ఎక్సైజ్శాఖ ఆధీనంలోని మద్యం డిపో నుం చి మద్యాన్ని లిఫ్టు చేస్తుంటారు. ఈ డిపోల నుంచి వ్యాన్లు, ఇతర పెద్ద వాహనాల ద్వారా తమ మద్యం దుకాణాల వరకు తీసుకెళ్తుంటారు. అయితే మద్యం రవాణా వాహనాలకు ఈవే బిల్లులు ఉండాల్సిందే నంటూ వాణిజ్య పన్నులశాఖ పట్టుబడుతుండగా, అవసరం లేదని ఎక్సైజ్శాఖ శనివారం నుంచి ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎక్కిడికక్కడ వాణిజ్య పన్నుల శాఖాధికారులు మద్యం రవాణా వాహనాలను సీజ్ చేస్తున్నారు.
మద్యంతో కూడిన వ్యాన్లను పోలీస్స్టేషన్లలో పెట్టేస్తున్నారు. దీంతో సో మ, మంగళవారం మద్యం దుకాణాల యజమానులు మద్యం తీసుకెళ్లడం నిలిపివేశారు. తిమ్మాజిపేట టీఎస్బీసీఎల్ స్టాక్పాయింట్ నుంచి మద్యం బయటకు వెళ్లలేదు. స్టాక్ తీసుకున్న వాహనాలను స్టాక్ పాయింట్ నుంచి బయటకు తేవడానికి భయపడుతున్నారు. మద్యం గోదాంల నుంచి ఇతర జి ల్లాలో శనివారం మద్యాన్ని తీసుకెళ్తున్న వాహనాల ను సీజ్ చేయడంతో విషయం రాష్ట్ర వ్యాప్తంగా పా కింది. దీంతో మద్యాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ సా హసించడం లేదు. దీంతో రెండు రోజులుగా మ ద్యం షాపుల్లో స్టాక్ అయిపోవడంతో మద్యం షాపు ల యజమానులు ఎటూ తోచక తిమ్మాజిపేట మ ద్యం గోదాంకు వచ్చి వాహనాలను ఇక్కడే నిలిపివేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు మద్యాన్ని తీసుకెళ్లబోమని దుకాణ యజమానులు తెలిపారు. దీంతో తిమ్మాజిపేటలో మద్యాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి.