మహబూబ్నగర్, జనవరి 11 : దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దళితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించారు. మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. దళితులు ఆర్థికం గా ఎదిగే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచన చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరా రు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ను కలిసి వస్తామని లబ్ధిదారులు ప్రయత్నించగా పోలీసులు మెయిన్గేట్ వద్ద అడ్డుకున్నారు. తమను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా అంతలోనే సమీకృత కలెక్టరేట్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం చేపట్టిన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆందోళనను చూసి కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు.
తమకు న్యాయం జరిగే వర కు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పథకానికి అర్హులుగా ఎంపిక చేస్తు ప్రభుత్వం జారీ చేసిన ప్రొసీండింగ్లను మీడియాకు చూయించా రు. జిల్లా వ్యాప్తంగా 2,982 మందికి గత ఏడాది నవంబర్లో దళిత బంధు పథకం కింద ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరందరికీ సంబంధిత బ్యాంకుల్లో అకౌంట్లను కూడా ఓపెన్ చేయించా రు. కాగా ఎన్నికల కోడ్ రావడంతో పథకం లబ్ధిదారులకు పడాల్సిన నగదు సాయం వాయిదా పడింది. కాగా ప్రభుత్వం మారడం.. 40రోజులు దాటుతున్నా ఇంకా ఈ పథకంపై కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధును రద్దు చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ఆందోళన చేస్తున్న లబ్ధిదారులను నచ్చజెప్పి కొంతమందిని వినతిపత్రం అందించడానికి కలెక్టరేట్లోకి అనుమతించారు. అనంతరం దళితబంధు లబ్దిదారులకు న్యాయం చేయాలంటూ అడిషనల్ కలెక్టర్ మెహన్రావుకు వినతిపత్రం అందించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం అయిన ఆందోళన మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, దేవరకద్ర మార్కెట్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పెద్ద జంబులయ్య, నవాబ్పేట మాజీ ఎంపీపీ శ్రీ నివాస్, నర్సింహులు, రాజమల్లు, బుచ్చన్న, రా ములు, రాంచంద్రయ్య, బాలయ్య ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలా ఆదుకునేందుకు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిం ది. ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే ద ళితులు అభివృద్ధి చెందే అ వకాశం ఉంది. ప్రభుత్వం దళితులపై పెద్ద మనస్సు చే సుకొని పథకాన్ని వందశాతం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆందోళనలు ఉధృ తం చేస్తాం.
దళితబంధు తక్కువ స మయంలో ఎక్కువ మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన పథకం. దీని సాయంతో మేము మంచి గా బతుకుతాం.. ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించడానికి కాంగ్రెస్ ప్రభు త్వం ప్రయత్నించాలి. కానీ రద్దు చేస్తామని అంటుండడం మంచి పద్ధతి కాదు. రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
కలెక్టరేట్లో ప్రపంచ వికలాంగుల దినోత్సవా న్ని సంబంధిత శాఖాధికారులు అట్టహాసంగా ని ర్వహించి ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే దళితులు నిరసన చేస్తున్న విషయం తెలియక కా ర్యక్రమానికి హాజరయ్యేందుకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి వచ్చారు. విష యం తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ ఎదుట దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారని తెలిపా రు. దీంతో ఎమ్మెల్యే ఎక్కడ అడ్డుకుంటారోననే భ యంతో వెనుదిరిగారు. కలెక్టరేట్కు రాకుండానే తిరిగి వెళ్లిపోవడంతో అధికారులు కార్యక్రమాన్ని కొంతసేపు వాయిదా వేసుకున్నారు. కాగా ఎమ్మె ల్యే వస్తున్నాడని తెలిసిన దళిత బంధు లబ్ధిదారు లు ఘెరావ్ చేయడానికి సమయాత్తమయ్యారు. అంతలోనే ఎమ్మెల్యే వెళ్లిపోయాడని సమాచారం రావడంతో సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితబంధు పథకాన్ని కొనసాగించాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రత రం చేస్తామని దళితులు హెచ్చరించారు.