గద్వాల, ఫిబ్రవరి 8 : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, కృష్ణానది హక్కులను కాపాడుకుందామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గురువారం సా యంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చలో నల్గొండ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన నీళ్లు మనం వా డుకొని రైతు రాజులా బతికాడన్నారు. కానీ ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు విధానాలతో, కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రంలోని కేఆర్ఎంబీకి అప్పగించి మన పొలాలను ఎండబెట్టే విధానాలకు పాల్పడుతున్నది.
పెద్దలు, మేధావులు చెప్పినా ఒంటెద్దు పోకడలతో కేఆర్ఎంబీకి వత్తాసు పలుకుతున్నదన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ ఈనెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాభేరికి జిల్లా నుంచి రైతు లు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎ త్తున తరలివచ్చి తెలంగాణ హక్కులను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోవిందు, కౌ న్సిలర్లు మహేశ్, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, దౌలు, కృష్ణ, నాగరాజు, నాయకులు ధర్మనాయు డు, రామకృష్ణ, వంశీ, రిజ్వాన్, మోబిన్, అన్వర్, మధు, పవన్, జగదీశ్, వీరేశ్, రాజు పాలొన్నారు.