కొల్లాపూర్, నవంబర్ 4 : మీ ఇంటి పెద్దకొడు కు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి మూడోసారి కేసీఆర్ను సీఎంను చేసుకుందామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలం సింగవట్నంలో ఎమ్మెల్యే బీరం వ్యవసాయ క్షేత్రంలో శనివారం కాంగ్రెస్, టీడీపీ, జగదీశ్వర్రావు వర్గీయులు నియోజకవర్గంలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాల్లోని 1500మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, ఎంపీ రాములు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్రావు, గౌరారం వెంకట్రెడ్డి, ధారాసింగ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీకండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ నాయకుడు ధారాసింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ గాయిగాయి గత్తర చేసే కాంగ్రెసోళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కర్ణాటక మోడల్ అంటూ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు చెప్పే బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టిన కూడా ఆ పార్టీ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలకు అతిగతీలేకుండా పోయిందని ఆరోపించారు. అక్కడ రోజుకు 7గంటల కరెంట్ కూడా అందించలేమని ఆ రాష్ట్ర మంత్రే స్వయంగా ప్రకటన చేశాడంటే అక్కడ రైతులు పడుతున్న కష్టాలు అంతా ఇంతాకావన్నారు. మీరు మాలాగా కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయి గోసపడొద్దంటూ కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే బీరం గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇచ్చే 24గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ కావాలా? లేక రేవంత్రెడ్డి ఇచ్చే 3గంటల కరెంట్కావాలో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని, ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉందన్నారు. పంచాయితీరాజ్శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి నియోజకరవ్గంలో రహదారులను అభివృద్ధి చేయలేని అసమర్థుడని విమర్శించారు. కొల్లాపూర్ ప్రాంత ద్రోహి జూపల్లి అని ఎమ్మెల్యే బీరం మండిపడ్డారు.
కాంగ్రెసోళ్లు ఓట్ల కోసం మీ ఇంటి ముందుకు వస్తారు. ఓట్ల పం డుగ ముగిశాక మనకు కనపడకుండా పోతారని అలాంటి వారిని నమ్మవద్దని, అభివృద్ధి చేసే నా యకులకు అండగా ఉండాలని కోరారు. అనంత రం బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మాట్లాడుతూ నాడు ఉ మ్మడి జిల్లాలో అభివృద్ధిలో కొల్లాపూర్ వెనుకబాటులో ఉండగా.. నేడు అదే ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో మేటిగా నిలబడుతుందని, అందుకే మన కు అభివృద్ధి చేసే నాయకుడు బీరంను మీరు మ రువొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పార్టీల నుంచి చిన్నంబావి మండలం లో దగడపల్లిలో 72మంది, అయ్యవారిపల్లిలో సాయి లు, కృష్ణయ్య, చిన్నపుల్లయ్యతోపాటు ఐదుగురు, కొప్పునూర్లో కాంతారావు, గోవింద్, బె క్కెం నేలబిల్కు, పెద్దబిల్కు గ్రామాల నుంచి 50 మం ది, చిన్నంబావి మండల బీఎస్పీ అధ్యక్షుడు మహేశ్బండారి, మియ్యాపూర్ ఉపసర్పంచ్ శివ, పాన్గల్ మండలం కదిరెపాడు నుంచి 20మందితోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతోపాటు జగదీశ్వరావు వర్గీయులు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో వివిధమండలాల నాయకులు ఉన్నారు.