వడ్డేపల్లి, ఫిబ్రవరి 8 : భారత్మాల రోడ్డులో కొంకల, జులేకల్ శివారులోని రైతుల భూములు పోగా వాటికి పరిహారం పెంచాలని కోరుతూ కొం కల వద్ద గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. సుమారు ఐదు గంటలపాటు నిర్వహించిన ఆందోళనతో భారత్మాల రోడ్డు పనులకు తీవ్ర అంతరా యం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నేషనల్ రహదారి 150సీ పరిధిలో భూసేకరణ చట్టం కింద తీసుకున్న భూములకు ఎకరం త రి పొలానికి రూ.7.17 లక్షలు, మెట్ట భూమికి రూ. 4.50 లక్షలు మాత్రమే ఇచ్చారని, ఇక్కడ ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.40లక్షలు పలుకుతుందన్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు.
దీనిపై ఇది వరకే కలెక్టర్కు ఫిర్యా దు చేశామని, అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో ప ర్యటించి రైతుల వివరాలు సేకరించారన్నారు. కానీ ఇంత వరకు భూముల ధర పెంపు విషయం మాత్రం చెప్పడం లేదన్నారు. భూముల ధరలు పెంచకపోతే తీవ్రంగా నష్టపోతామని, మాకు న్యాయం జరగకపోతే జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమం లో రైతులు రాజమోహన్రెడ్డి, హరికృష్ణారెడ్డి, మద్ద్దిలేటి, లక్ష్మీకాంతరెడ్డి, కృష్ణ, నాగన్న, భీముడు, బ్ర హ్మంరెడ్డి, బొంకూరు రాజన్న, రామారావు, సుధాకర్, రఘు, నర్సింహులుతోపాటు కొంకల, జులేకల్ శివారు రైతులు పాల్గొన్నారు.