మల్దకల్, డిసెంబర్ 27 : ఆదిశిలా క్షేత్రంలో మం గళవారం అర్ధరాత్రి స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథోత్సవానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి తెలంగాణ జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడగా ఆదిశిలా క్షేత్రం అంతా గోవింద నామస్మరణతో మా ర్మోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్కుమార్, జెడ్పీటీసీ ప్రభాకర్రెడ్డి, సర్పంచ్ యాకోబు, వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, అజయ్, నరేందర్, బాబురావు, మధు, ఆంజనేయులు, మధు, భాస్కర్గౌడ్, తిమ్మరాజు, పరశురాముడు, నరేందర్శెట్టి పాల్గొన్నారు.
ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం భక్తు లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భ క్తులు స్వామివారికి దాసంగాలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.