దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), డిసెంబర్ 10 : చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలిసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటికీ జాతర కొనసాగుతున్నది. కార్తీకమాసం అలాగే సెలవుదినం కావడంతో ఆదివారం భక్తులు వేల సంఖ్య లో కురుమూర్తి కొండకు తరలిరావడంతో గోవిం ద నామస్మరణతో కాంచనగుహ మార్మోగింది. భక్తులు ముందుగా భక్తి శ్రద్ధలతో పుష్కరిణీలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారికి నైవేద్యా లు సమర్పించారు.
అలాగే కొందరు భక్తులు మెట్టుమెట్టుకు కొబ్బరికాయలు కొడుతూ మొక్కు లు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అనంతరం మహిళలు గాజుల దుకాణా లు, స్వీట్లు దుకాణాల్లో కొనుగోలు చేయడంలో బిజిబిజీగా ఉండగా చిన్నారులు రంగుల రాట్నా లు, జాయింట్ వీల్ తదితర వాటిని ఎక్కుతూ ఆటవస్తువులు కొనుగోలు చేస్తూ సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.