జలదృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ నుంచి
కృష్ణమ్మ కదిలొచ్చింది.. హెడ్రెగ్యులేటరీ ఒక్క గేటును 4 మీటర్లు ఎత్తగా.. టన్నెల్లోకి పరు
గులు పెట్టింది. తర్వాత సర్జ్పూల్ను ముంచెత్తగా 30 మీటర్ల మేర నీటిని నిల్వ చేయను
న్నారు. టెస్టింగ్ రన్ విజయవంతం కావడంతో ఇరిగేషన్ అధికారులు సంబురాల్లో మునిగిపో
యారు. ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి, ఇరిగేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు.అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. 16న వెట్న్న్రు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో దశల వారీ పరీక్షల్లో భాగంగానే టెస్టింగ్ నిర్వహించినట్లుఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
– మహబూబ్నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్ ( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొల్లాపూర్, సెప్టెంబర్ 12 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భా గంగా నార్లాపూర్ జీరో పాయింట్ నుంచి సర్జ్పూల్లోకి నీటి విడుదలను విజయవంతంగా పరీక్షించారు. మంగళవారం టెస్టింగ్ రన్ నిర్వహించారు. అంతకుముందు హెడ్రెగ్యూలేటరీ వద్ద పూజలను నిర్వహించి కృష్ణా జలాలను టన్నెలోకి.. ఆ తర్వాత సర్జ్పూల్లోకి తరలించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ వద్ద నుంచి వచ్చిన జలాలను రెగ్యూలేటరీ గేటును 4 మీటర్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు హెడ్రెగ్యులేటరీ వద్ద ప్రత్యేక పూజలు చేసి సుమారు సా యంత్రం 5:30 గంటలకు 4వ గేటును ఎత్తి నీటిని విడుదల చేశారు.
16న ముఖ్యమంత్రి వెట్న్న్రు ప్రారంభించనున్నారు. నార్లాపూర్ వద్ద మహాబాహుబలి పంపులను స్విచ్ ఆన్చేసి నీటి విడుదలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మామూలు తనిఖీలో భాగంగానే టెస్టింగ్ రన్ నిర్వహించినట్లు చీఫ్ ఇంజినీరింగ్ హమీద్ఖాన్ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అప్రోచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాలు టన్నెల్లోకి ప్రవేశించి సర్జ్పూల్లోకి వెళ్లడంతో ఇరిగేషన్ అధికారుల ఆనందానికి అంతులేకుండా పోయింది. టెస్టింగ్ రన్ విజయవంతం కావడంతో ప్రాజెక్టుల సలహాదారుడు పెంటారెడ్డి, ఇరిగేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్లోని జీరో పాయింట్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్రెగ్యూలేటరీ వద్ద ఉన్న కృష్ణా జలాలను గేటు ఓపెన్ చేసి టన్నెల ద్వారా సర్జ్పూల్లోకి పంపించే ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగింది. ఇంజినీరింగ్ సిబ్బంది, ఏజెన్సీ ఇంజీనీర్లు కలిసి హెడ్రెగ్యూలేటరీ గేట్ ఎత్తివేయడంతో కృష్ణమ్మ బిరాబిరా అంటూ టన్నెల్లోకి ప్రవేశించింది. ఈ అపూర్వ ఘట్టం విజయవంతం కావడంతో అక్కడ ఉన్న ఉద్యోగులు, సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు. 74 మీటర్ల ఎత్తున సర్జ్పూల్లోకి 30 మీటర్ల మేర నీటిని నిల్వ చేయనున్నారు. దశల వారీగా నీటిని సర్జ్పూల్లోకి ప్రవేశపెడుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా..? లేదా అని పరిశీలించనున్నారు. సర్జ్పూల్లోకి హై రిజ్యులేషన్ కెమారాలను బిగించి కంట్రోల్ రూం ద్వారా మానిటరింగ్ చేయనున్నారు.
ఈ నెల 3న డ్రై రన్ విజయవంతం కాగా 13 రోజుల్లోనే వెట్న్క్రు సిద్ధమైంది. వెట్న్ విజయవంతం అవుతుందని ముందే భావించిన ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ నార్లాపూర్ పంపుహౌస్ ద్వారా నీటిని రిజర్వాయర్లోకి మళ్లించొచ్చని సీఎం కేసీఆర్కు వివరించారు. దీంతో 16న ముహూర్తం ఖరారైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈక్రమంలో నిర్వహించిన టెస్టింగ్ రన్ విజయవంతం కావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.
నార్లాపూర్ పంప్హౌస్లో మంగళవారం టెస్టింగ్ రన్ నిర్వహించి కృష్ణా జలాలను సర్జ్పూల్లోకి పంపించాం. ఈ నెల 16న సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్లోకి విడుదల చేయనున్న నేపథ్యంలో ముందస్తు పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ పూర్తి చేశాం. మోటర్ ఆన్ చేసే వరకు అనేక ప్రక్రియలు దశల వారీగా నిర్వహిస్తాం.
– హమీద్ ఖాన్ , సీఈ