కోస్గి, జనవరి 10 : మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లను, వార్డు కౌన్సిలర్లను కొడంగల్ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం కోస్గి పట్టణంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సయ్యద్పహాడ్ దర్గా నుంచి ఉపసముద్రం వరకు బైపాస్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ దవాఖాన నుంచి సయ్యద్ పహాడ్ వరకు రోడ్డు విస్తరణ పనులు సంక్రాంతి తర్వాత షురూ చేయాలని సూచించారు. అభివృ ద్ధి పనులను కౌన్సిలర్లు పర్యవేక్షించాలన్నారు. 16 వ వార్డులో నీటిసమస్య ఉన్నదని మహిళలు ఎ మ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడగా.. రెండ్రోజుల్లో సమ స్య లేకుండా చూస్తామన్నారు.
బుధవారం నుంచి మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ ఉదయం రెండు గంటలు రోజుకో వార్డులో పర్యటించి సమస్యల ను పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీలో సుమారు 600 పాత ఇండ్లు ఆన్లైన్లో లేవని, ఫి ర్యాదులు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ శ్రీహర్షతో ఎమ్మెల్యే మాట్లాడారు. సంక్రాంతి తర్వాత స్పెషల్డ్రైవ్ కింద మున్సిపల్ సిబ్బంది తిరిగి ఇండ్ల వివరాలు సేకరించి ఆన్లైన్ చేయాలన్నారు. పాతర్లగ డ్డ అంజన్న ఆలయం నుంచి తిమ్మాయిపల్లి లింక్రోడ్డు, తిమ్మాయిపల్లి-గుండ్లపల్లి లింక్రోడ్డు పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించా రు. కుమ్మరులకు ఎకరా, మైనార్టీలకోసం ఎకరా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని తాసిల్దార్ మమతను కోరారు. కార్యక్రమంలో కమిషనర్ పూర్ణచందర్, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి పాల్గొన్నారు.