పాలమూరు, డిసెంబర్ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల బాలుర వసతిగృహంలో ఆదివారం నిర్వహించిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు రూ.200 పింఛన్ మాత్రమే వచ్చేదని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్ర భుత్వం రూ.3,016 పింఛన్ అందిస్తున్నదని తెలిపారు. ది వ్యాంగులకు ప్రభుత్వ పింఛన్ భరోసానిస్తున్నదని చెప్పారు. అలాగే దివ్యాంగుల క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నుంచి జిల్లా కేంద్రంలో ప్రత్యేక హోం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహు లు, ముడా చైర్మన్ గంజి వెంకన్న పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని బృందావన్కాలనీ అభయాంజనేయస్వామి ఆలయ సుందరీకరణకు మంజూరైన రూ.10లక్షల నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్ను ఆదివారం మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభయాంజనేయస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చే సేందుకు నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. సకాలంలో పనులు చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ తిరుమల వెంకటేశ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 25 : జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి హజ్రత్ సయ్యద్షా జమాల్ హుస్సేనీ చిస్తీ, సయ్యద్ కమాల్ హుస్సేనీ చిస్తీ రహెమాతుల్లా అలై దర్గా ఉర్సును ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తవల్లి ఇంటి నుంచి రామయ్యబౌలి, అశోక్టాకీస్ చౌరస్తా, తిమ్మసానిపల్లి గేట్, దొడ్డలోనిపల్లి మీదుగా దర్గా వరకు గంధోత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్య్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, ముతవల్లి షా మహ్మద్ ఫజల్ఖాన్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ షబ్బీర్, నాయకులు షఫీ, జావిద్బేగ్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.