పాలమూరు, ఏప్రిల్ 4: ఉమ్మడిజిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇప్పటికే పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామని… కరివెన, ఉదండాపూర్ పనులు 80శాతం పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ చివరికల్లా పనులు పూర్తి చేసి కరివెన ద్వారా సాగునీటిని అందిస్తామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నా రు. పాలమూరు జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటుచేసిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి మం త్రి ముఖ్యఅతిథిగా హాజరు కాగా జిల్లా పరిధిలోని వివిధ అంశాలపై ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు మాట్లాడారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కోయిల్సాగర్ ప్రాజెక్టును నింపే వారమని.. భవిష్యత్తులో ఇక్కడి నుంచే జూరాలకు రివర్స్ పంపింగ్ చేసే అవకాశం రాబోతున్నదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి త్వరలో కరివెన నుంచి టన్నెల్ ద్వారా ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు పనుల పురోగతిని పరిశీలించి వేగంగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. గతంలో జెడ్పీ సమావేశాలు తాగునీటి నిరసనలకు కేరాఫ్ అడ్రస్గా ఉండేవని.. మిషన్ భగీరథతో సమస్యకు సీఎం కేసీఆర్ చెక్ పెట్టారన్నారు. పట్టణానికి కూత వేటు దూరంలో 25వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండడం గొప్ప విషయమన్నారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు నుంచి మైసమ్మ వరకు అడవిలో 13 కిలోమీటర్ల మేర జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తామని, గోల్ బంగ్లా వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఫత్తేపూర్ మైసమ్మ ఆలయానికి అటవీశాఖ నుంచి 10 ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని.. అం దుకు బదులుగా వెంకటాపూర్ వద్ద 20 ఎకరాల ప్రభుత్వభూమిని అటవీశాఖకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో ఎకో టూరి జం అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ రవినాయక్, అడిషనల్ కలెక్టర్ సీతారామారావు, జె డ్పీ సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.