జడ్చర్లటౌన్, మే 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నదని జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య అన్నారు. మండలంలోని ఈర్లపల్లిలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పేదల పరిస్థితులను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించి ఉచితంగా మందులు, అద్దాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. కంటివెలుగు శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రకాశ్ కళాబృందం ఆధ్వర్యంలో కంటివెలుగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రాజేందర్రెడ్డి, పర్వతాలు, రమేశ్ పాల్గొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని 25వ వార్డులో 168 మందికి పరీక్షలు నిర్వహిం చి 13మందికి అద్దాల ను అందజేశారు. మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఈర్లపల్లిలో 183మందికి పరీక్షలు నిర్వహించి 27మందికి అద్దాలను ఇచ్చా రు. మరో 29 మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. దేవునిగుట్టతండాలో 131మందికి పరీక్షలు నిర్వహిం చి ఐదుగురికి అద్దాలను అందజేశారు. మరో నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మాచారంలో 157 మందికి పరీక్షలు నిర్వహించి 14మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో నలుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు.
రాజాపూర్ మండలంలో..
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా కుత్నేపల్లిలో 164మందికి పరీక్షలు నిర్వహించి 16మందికి అద్దాలను అందజేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. మరో 19మందికి అద్దా ల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కల్లేపల్లిలో 175 మందికి పరీక్షలు నిర్వహించి ఆరుగురికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 8మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. గుండ్లపొట్లపల్లిలో 167మందికి పరీక్షలు నిర్వహించి 8మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో ఆరుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు సురేశ్ రాథోడ్, రవికుమార్, అక్షయ్గౌడ్, డేవిడ్ పాల్గొన్నారు.
కౌకుంట్ల, సీసీకుంట మండలాల్లో..
కౌకుంట్ల మండలం మీనిగోనిపల్లిలో 140మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఆరుగురికి అద్దాలను అందజేశారు. మరొకరికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. చిన్నచింతకుంట మండలం పెద్ద వడ్డెమాన్లో 151మందిని పరీక్షించి ముగ్గురికి అద్దాలను పంపిణీ చేయగా, మరో ఆరుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. నెల్లికొండిలో 151మందికి పరీక్షలు నిర్వహించి 38మందికి కండ్లద్దాలను అందజేశారు. మరో 26మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫీక్, రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, శ్రీనివాసులు, ఖాదర్, సుశీల పాల్గొన్నారు.