జడ్చర్లటౌన్, మార్చి 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరంలాంటిదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. మున్సిపాలిటీలోని ఏడోవార్డులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏడోవార్డులో మొత్తం 116మందికి కంటి పరీక్షలు నిర్వహించి 32మందికి అద్దాలను పంపిణీ చేశారు.
మరో 13మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 18వ వార్డులో 140మందికి పరీక్షలు నిర్వహించి 10మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 17మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు. అలాగే మండలంలోని మాటుబండతండాలో 72మందిని పరీక్షించి 19మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. మరో 14మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. ఖానాపూర్లో 82మందిని పరీక్షించి 20మందికి అద్దాలను అందజేయగా, మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ సమత తెలిపారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 2 : కంటివెలుగు కార్యక్రమంలో భా గంగా రాఘవాపూర్లో 126మందిని పరీక్షించి 52మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు డాక్టర్ మధుసూదన్రావు తెలిపారు. మరో 9మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంటివెలుగు కోఆర్డినేటర్ శ్రీనివాసు లు, డాక్టర్లు మౌనిక, రవికుమార్, ఉత్తరయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 2 : మండలంలోని భైరంపల్లిలో 149మందికి కంటి పరీక్షలు నిర్వహించి 26మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు డాక్టర్ మనుప్రియ తెలిపారు. మరో 33మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వెలుగొములలో 135మందిని పరీక్షించి 13మందికి అద్దాలను పంపిణీ చేయగా, 11మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కృష్ణకుమార్, సిబ్బంది దేవయ్య, జంగయ్య పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, మార్చి 2 : మండలంలోని కాకర్లపహాడ్, పోమాల, నీర్సాబ్తండాల్లో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. కాకర్లపహాడ్లో 150 మందిని పరీక్షించి 22మందికి కండ్లద్దాలు పంపిణీ చేయగా, మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. నీర్సాబ్తండాలో 102మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఐదుగురికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 13మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. పోమాలలో 160మందిని పరీక్షించి 31మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 28మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి విజయలక్ష్మి, సర్పంచులు పుష్పమ్మ, జంగమ్మ, ఎంపీటీసీ ఊర్మిళాదేవి, సిబ్బంది శకుంతల, శ్రీనివాస్, శరబలింగం, అవినాశ్ పాల్గొన్నారు.
కౌకుంట్ల, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, మార్చి 2 : కౌకుంట్ల మండలకేంద్రం లో 145మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఐదుగురికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 8మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. అమ్మాపూర్లో 142మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఇద్దరికి అద్దాలను పంపిణీ చేశారు. మరో 8మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. లాల్కోటలో 160మందిని ప రీక్షించి 17మందికి అద్దాలను అందజేయగా, మరో 33మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫీక్, రాధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేట ర్ రాజన్న, శ్రీనివాసులు, ఖాదర్, సుశీల పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మార్చి 2 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంగాధర్పల్లిలో 141మందిని పరీక్షించి 9మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ సృజన తెలిపారు. అలాగే పెద్దబాయితండాలో 130మందిని పరీక్షించి 19మందికి అద్దాలను పంపిణీ చేయగా, మరో 9మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, మార్చి 2 : మండలంలోని లంబడికుంటతండాలో మొత్తం 382మందికి కంటి పరీక్షలు నిర్వహించి 45మందికి అద్దాలను పంపిణీ చేసినట్లు సీహెచ్వో రామ య్య తెలిపారు. అలాగే మద్దిగట్లలో 1,324మందిని పరీక్షిం చి 223మందికి కండ్లద్దాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు అబ్దుల్బ్బ్రు, హిమబిందు, రాధిక, సూపర్వైజర్లు యాదమ్మ, సుధాకర్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, మార్చి 2 : కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా షేక్పల్లిలో 112మంది, మొకర్లాబాద్లో 124 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, అద్దాలను అందజేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. శుక్రవారం ముందరితండా, వెంకట్రెడ్డి గ్రామాల్లో కంటివెలుగు శిబిరాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.