జడ్చర్ల, ఫిబ్రవరి 7: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో బుధవారం కందికి అత్యధికంగా రూ.10,183 ధర పలికింది. మార్కెట్కు 85 క్విం టాళ్ల కందులు అమ్మకానికి రాగా క్వింటాకు గరిష్ఠం గా రూ. 10,183, కనిష్ఠంగా రూ.9,840, మధ్యస్తంగా రూ.10,182 ధర లభించింది. అదేవిధంగా 6,322 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా దా నికి క్వింటాకు గరిష్ఠంగా రూ.7,276, కనిష్ఠంగా రూ.4,390, మధ్యస్తంగా రూ.7,137 ధర వచ్చిం ది.
అలాగే పత్తి క్వింటాకు గరిష్ఠంగా రూ.6,429, మినుములు క్వింటాకు గరిష్ఠంగా రూ.9,139, బెబ్బర్లు క్వింటాకు గరిష్ఠంగా రూ.7,416, మొక్కజొ న్న క్వింటాకు గరిష్ఠంగా రూ.1,952, ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం క్వింటాకు గరిష్ఠంగా రూ.3,168, జొన్నలు క్వింటాకు గరిష్ఠంగా రూ.5,754, ఉలువలు క్వింటాకు గరిష్ఠంగా రూ.7,267 ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.