నాగర్కర్నూల్, డిసెంబర్ 23 : 67వ సూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్-17వ బాలుర కబడ్డీ పోటీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జట్టు విజేతగా నిలిచింది. హనుమకొండలో నిర్వహించిన టోర్నీ ఫైనల్లో నల్లగొండ జట్టుతో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యా చ్లో నాగర్కర్నూల్ జిల్లా క్రీడాకారుడు నందకిశోర్ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. కామారెడ్డి జిల్లాలో జనవరిలో జరిగే సూల్ గేమ్స్ జాతీయస్థాయి నేషనల్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్కు ఎంపికయ్యాడని నాగర్కర్నూల్ జిల్లా సూల్ గేమ్స్ కార్యదర్శి పాండు తెలిపారు.
ఈ సందర్భంగా డీఈవో గోవిందరాజులు, పాండు, జిల్లా ఎస్పీసీ సెక్రటరీ ప్రసాద్గౌడ్ , జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారుడిని అభినందించారు. నైపుణ్యం గల క్రీడాకారులను తయారు చేసిన పీఈటీ, కోచ్ మేనేజర్లందరినీ జిల్లా సూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున అభినందించారు. క్రీడాకారుడు నందకిశోర్ లింగాలలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.