నాగర్కర్నూల్, మే 22: పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవు తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆయన సతీమణి జమునతో కలిసి 278 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 28మందికి మంజూరైన రూ.28లక్షల సీఎం సహాయనిధి చె క్కులను కూడా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఆ దుకునేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఒకేరోజు ఇంతమందికి చెక్కులను అందజేయడం ఆనందంగా ఉందన్నారు. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.
కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా116 అందించడం గొప్ప విషయమన్నారు. ఏ సీఎంకు రా ని ఆలోచన మన కేసీఆర్కు రావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. మహిళల కోసం మరిన్ని పథకాలను ప్రభుత్వ ప్రవేశపెడుతుందని చెప్పారు. మహిళా సంక్షేమానికి, రాష్ట్రం అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందేందుకు చర్యలు చేపడుతుందన్నారు. మహిళల రక్షణకు షీటీమ్స్, గర్భిణులు, చిన్నారులకు న్యూట్రీషన్ కిట్లు వంటి పథకాలను ప్రవేశపెట్టి.. అమలుచేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కూడా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వివరించారు. అనంతరం చెక్కులు తీసుకునేందుకు వచ్చి న జంటలు, వారి కుటుంబసభ్యులతో కలిసి ఎ మ్మెల్యే దంపతులు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హన్మంతురావు, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్గౌడ్, వైస్చైర్మన్ బాబురావు, ఎంపీపీ లు శ్రీనివాస్గౌడ్, నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నరేందర్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, ప్రదీ ప్, యార రమేశ్ తదితరులు పాల్గొన్నారు.