జడ్చర్లటౌన్, నవంబర్ 28 : సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. జ్యో తిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జడ్చర్లలో ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వివిధ కుల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్థానిక మండల మానవ వనరుల కేంద్రంలో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండలంలోని బూర్గుపల్లిలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రణీల్చందర్, దగ్గుల బాలరాజు, గిరియాదవ్, శ్రీను, విజయేందర్ పాల్గొన్నారు.
ఫూలేను స్ఫూర్తిగా తీసుకోవాలి
ప్రతిఒక్కరూ మహాత్మా జ్యో తిరావు ఫూలేను స్ఫూర్తిగా తీసుకొని నవసమాజ నిర్మాణానికి కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని చౌరస్తాలో జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ విద్య అందించేందుకు జ్యోతిరావు ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. దేశం లో అక్షరాస్యతను పెంచేందుకు తన భార్యకు అక్షరాలు నే ర్పించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, బోరింగ్ నర్సింహులు, గడ్డంరాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫూలే ఆశయసాధనకు కృషి చేయాలి
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య అన్నారు. ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని మండలకేంద్రంలో ఆయన చిత్రపటానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యాదయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు యాదగిరి, యాదయ్య, బాలరాజు, తౌర్యానాయక్, ఫయాజ్, నర్సింహులు, దస్తగిరి, రియాజ్, జంగయ్య పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
మండలకేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, బీఎస్పీ మండల కన్వీనర్ రమేశ్, మాజీ ఎంపీపీ మహేందర్గౌడ్, ఆంజనేయులు, మొగులయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.